English | Telugu

పూర్ణ ముద్దులకు న‌రేశ్ అల‌వాటు ప‌డ్డాడా?

'శ్రీదేవి డ్రామా కంపెనీ' ఈవారం అందరినీ అలరించింది. ఇందులో నాటీ నరేష్ డాన్స్ హైలైట్ గా నిలిచింది. తన లవ్ ఫెయిల్యూర్ అంశాన్ని తీసుకుని స్కిట్ కం డాన్స్ రూపంలో తన బాధ చెప్పేసరికి అందరూ ఎమోషన్ అయ్యారు. తర్వాత సదా "చాలా బాగా చేసాడని" కాంప్లిమెంట్ ఇచ్చింది. నరేష్ ని పిలిచి హగ్ చేసుకుని ముద్దులిచ్చేసింది పూర్ణ‌. తర్వాత పవిత్ర స్టేజి మీదకు వచ్చి "ఆ డాన్స్ న‌న్ను బాగా కదిలించింది" అని చెప్పింది.

తాను జబర్దస్త్ కి రాకముందు బయట జాబ్స్ చేసే టైములో అందరూ పొట్టి పొట్టి అని ఏడిపించే వారని గుర్తుచేసుకుని బాధపడింది పవిత్ర. తర్వాత ఆది, "పవిత్రా! ఏం చెప్పాలనుకున్నావో నీ మనసులో ఉన్న మాటను ఈరోజు నరేష్ కి చెప్పేయ్. ఎందుకంటే రేపటి నుంచి నిన్ను, నరేష్ ని స్కిట్ లో ఉంచుతారో లేదో తెలీదు" అంటూ కామెడీ చేశాడు.

నరేష్ ముఖాన్ని చూసి "వాడు భయపడుతున్నాడు" అంది ప‌విత్ర‌. "వాడు పూర్ణ ముద్దులకు అలవాటు పడ్డాడు కదా అలాగే ఉంటాయి ఎక్స్ప్రెషన్స్.. కానీ.. నువ్వు చెప్పేయ్" అనేసరికి, "పవిత్ర , నరేష్ ఇద్దరూ డాన్స్ చేస్తే బాగుంటుంది" అంది పూర్ణ.. "అందం అమ్మాయితే" అనే పాటకు నరేష్ ని ఎత్తుకుని డాన్స్ చేసింది ప‌విత్ర‌. అది చూసి, "ఒక తల్లి తన పిల్లాడిని ఆడించినట్టు ఉందిరా" అంటూ కౌంటర్ వేశాడు ఆది.

"వాళ్ళు కుళ్లిపోతున్నారులే నరేష్ వాళ్లకు ఎప్పుడూ ఇలా జరగలేదని" అని రష్మీ అన‌డంతో, "నాకు పవిత్ర ఉంది. నీకెవరున్నారు?" అంటూ రెచ్చిపోయి ఆదికి రివర్స్ కౌంటర్ వేశాడు నరేష్. "నువ్వు గుండెల మీద చెయ్యేసుకుని చెప్పు.. నాకెవరు లేరు" అని ఆది అడిగేసరికి "సెట్టు మొత్తం నీ వెనకే ఉంది" అంటూ నవ్వేశాడు నరేష్.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.