Read more!

English | Telugu

హౌస్ లో ఒకరికొకరు ర్యాంకింగ్ ఇచ్చుకున్న కంటెస్టెంట్స్!


బిగ్ బాస్ లో సోమవారం అనగానే నామినేషన్స్ హీట్ గుర్తొస్తుంటుంది. అలాంటిది ఇప్పుడు హౌస్ లో ఏడుగురు మాత్రమే ఉండటంతో ఇంకా దాని ప్రభావం ఎక్కువగా ఉంది. అయితే బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ లలో పర్ఫామెన్స్ వైజ్ గా ఎవరు ఉండాలి, ఎవరు బయటకెళ్ళాలో అనేది ప్రేక్షకులే నిర్ణయిస్తారు అనే విషయం బిగ్ బాస్ మరోసారి స్పష్టంగా కంటెస్టెంట్స్ కి చెప్పాడు.

అయితే బిగ్ బాస్ ఈ సారి నామినేషన్స్ ని కొత్తగా ఏర్పాటు చేసాడు. "ఒక్కో కంటెస్టెంట్ కి ఏ ర్యాంకు ఇవ్వాలో హౌస్ మేట్స్ అందరూ కలిసి ఏకాభిప్రాయంతో నిర్ణయించుకోండి" అని  చెప్పాడు. అలా చెప్పగానే ర్యాంకింగ్ వైజ్ ఒక్కో కంటెస్టెంట్ వచ్చి నిల్చున్నారు. మొదటి ర్యాంక్ వెనుక రేవంత్, సెకండ్ ర్యాంక్ వెనుక ఇనయా, థర్డ్  కీర్తిభట్, ఫోర్త్ శ్రీసత్య, ఫిఫ్త్ శ్రీహాన్, ఆదిరెడ్డి సిక్స్త్, రోహిత్ సెవన్.. ఇలా ఒక్కొక్కరుగా వచ్చి ర్యాంకింగ్ లో నిల్చున్నారు. ఇలా నిల్చున్న తర్వాత అసలు కథ మొదలైంది.

ఇక ఆ తర్వాత ఏకాభిప్రాయంతో అందరూ కలిసి ఒక్కో కంటెస్టెంట్ కి ఏ ర్యాంకు అయితే బాగుండో అని చర్చించుకున్నారు. అలా మొదటి ర్యాంకు కోసం రేవంత్ కి మెజారిటీ ఆఫ్ కంటెస్టెంట్స్ ఓట్లు వేయడంతో అతడికే మొదటి స్థానం ఇవ్వగా, తర్వాత స్థానానికి ఇనయా, ఆదిరెడ్డి, శ్రీహాన్ పోటీ పడగా ఎక్కువ మెజారిటీ శ్రీహాన్ కి దక్కడంతో శ్రీహాన్ కి సెకండ్ ర్యాంక్ దక్కింది. ఆ తర్వాత మూడవ స్థానంలో ఇనయా, శ్రీసత్య, ఆదిరెడ్డి పోటీపడగా ఆదిరెడ్డికి ఎక్కువ మెజారిటీ లభించండంతో మూడవ ర్యాంక్ ఆదిరెడ్డికి దక్కింది. ఆ తర్వాత నాల్గవ ర్యాంక్ ఇనయాకి, అయిదు శ్రీసత్యకి, ఆరు రోహిత్ కి, ఏడు కీర్తి భట్ కి దక్కాయి. ఇలా ఒక్కో కంటెస్టెంట్ కి ఒక్కో ర్యాంక్ ని ఇచ్చుకున్నారు హౌస్ మేట్స్.