English | Telugu

ఎగ్జిబిషన్ కి మెట్రో ట్రైన్ లో ప్రయాణం.. మా పాప మిస్ అయింది!

మనం ఏదైన ఎగ్జిబిషన్ కి ఫ్యామిలీతో కలిసి వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటాం . ఎందుకంటే ఎగ్జిబిషన్ కి ఎక్కడెక్కడి నుండో చాలామంది వస్తుంటారు. వారిలో మనవాళ్ళు ఎవరు తప్పిపోయిన మళ్లీ కలవడం కష్టమే. అయితే సూపర్ ఫాస్ట్ గా అభివృద్ధి జరిగే నగరాలలో సూపర్ ఫాస్ట్ ప్రయాణాల కోసం మెట్రో లు మొదలయ్యాయి. మెట్రో ట్రైన్ లో రోజు కొన్ని లక్షల మంది ప్రయాణిస్తుంటారు. వారిలో ఒక్కరు మిస్ అయిన మళ్లీ దొరకడం కష్టమే.‌ అచ్చం అలాగే జరిగింది. హరిత జాకీ వాళ్ళ అమ్మాయి మెట్రో ట్రైన్ లో మిస్ అయింది.

హరిత జాకీ.. టెలివిజన్ సీరియల్స్ లో నటిస్తూ పాపులారిటీ సంపాదించుకున్న నటి. చెన్నై లో పుట్టి పెరిగిన హరిత.. తన పదిహేనవ ఏటనే సినిమాలలో నటించింది. అయితే తనకి సీరియల్స్ తో మంచి గుర్తింపు వచ్చిందనే చెప్పాలి. అగస్ట్ 14, 2001లో హరిత జాకీని పెళ్ళి చేసుకుంది. వాళ్ళిద్దరు దూరదర్శన్ లో వచ్చే కార్యక్రమాలలో కలిసి నటించేవారు. ఆ తర్వాత ఈటీవిలో ప్రసారమైన 'సంఘర్షణ' సీరియల్ లో తొలిసారి తన భర్త జాకీతో‌ కలిసి నటించింది. అప్పటి నుండి చాలా సీరియల్స్ లలో ఇద్దరు కలిసి నటించారు. అయితే జీ తెలుగులో ప్రసారమైన 'కలవారి కోడళ్ళు' సీరియల్ లో తను చేసిన నటనకి గాను అవార్డ్ కూడా వచ్చింది. ఆ తర్వాత వరుసగా సీరియల్స్ లో నటిస్తూ టాప్ మోస్ట్ సీనియర్ ఆర్టిస్ట్ గా ఉంది. అయితే జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'ముద్ద మందారం' లో తనకి ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం పద్మావతి కళ్యాణం అనే సీరియల్ లో తను నటిస్తుంది.

హరిత అండ్ జాకీ ఇద్దరు కలిసి రెగ్యులర్ గా రీల్స్ చేస్తూ ఇన్ స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంటున్నారు. అయితే హరిత తనకి సంబంధించిన ప్రతీ అప్డేట్ ని తన యూట్యూబ్ ఛానెల్ లో వ్లాగ్ లుగా చేస్తూ అప్లోడ్ చేస్తుంటుంది. అయితే తాజాగా మరో వ్లాగ్ ని అప్లోడ్ చేసింది. మెట్రో ట్రైన్ లో ఫ్యామిలీతో కలిసి ప్రయాణిస్తున్న హరిత జాకీలకి అనుకోని షాక్ ఎదురైంది. ఓ ఎగ్జిబిషన్ కి వెళ్తుండగా వాళ్ళ పాప ట్రైన్ ఎక్కేలోపే డోర్స్ అన్నీ క్లోజ్ అయ్యాయంట. ఇక తర్వాతి స్టాప్ లో హరిత అండ్ జాకీ వాళ్ళ అమ్మాయి కోసం ఎదురు చూడగా..‌ కాసేపటికి తను మరో ట్రైన్ లో వచ్చేసింది. వాళ్ళంతా మెట్రో ట్రైన్ లో ఎక్కడం ఇదే తొలిసారి అంట.‌ అందుకే ఇలా జరిగిందంటే తమ అనుభవాలని పంచుకున్నారు. అయితే ఫ్యామిలీతో కలిసి వెళ్ళేముందు జాగ్రత్తగా ఉండాలని హరిత జాకీ తమ సబ్ స్క్రైబర్స్ కి తెలియజేసింది. కాగా ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.