English | Telugu

Guppedantha Manasu : వాళ్ళిద్దరిది కన్నపేగు బంధమే.. అల్లాడిపోయిన అనుపమ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -1063 లో...నేను వెళ్లి తాతయ్యకి జరిగిందంతా చెప్తాను.. మంచి లాయర్ ని పెట్టి ఎలాగైనా మనుని బయటకు వచ్చేలా చేయమని చెప్తానని ఏంజిల్ అనగానే.. వద్దని అనుపమ అంటుంది. అసలే నాన్న ఆరోగ్యం బాగోలేదు. ఈ టైమ్ లో ఇదంతా చెప్పి బాధపెట్టడం వద్దని అనుపమ అంటుంది. వసుధార కూడ అలాగే చెప్తుంది.. ఇక నువ్వు ఇంటికి వెళ్లి తాతయ్యని చూసుకోమంటు ఏంజిల్ ని పంపిస్తుంది అనుపమ.

అ తర్వాత అనుపమ మను దగ్గరికి వెళ్తుంది. థాంక్స్ మేడమ్ ఇప్పుడైనా చూడడానికి వచ్చారు. ఇప్పుడు సానుభూతితో వచ్చారా ప్రేమతో వచ్చారా.. సానుభూతితో వస్తే ఒక సాటిమనిషిగా వచ్చారనుకుంటాను ప్రేమతో వస్తే నా తల్లిగా వచ్చారనుకుంటానని మను అనగానే.. అనుపమ ఎమోషనల్ అవుతుంది. మీకు నా పైన ప్రేమ చూపించే అవకాశం వచ్చింది.. చూపిస్తున్నారు కానీ నాకు అవకాశం రావడం లేదని మను అంటాడు. అమ్మ అని పిలవడంలో మాత్రమే నా ప్రేమని చూపించగలను కానీ అ అవకాశం లేదు. ఇంతకి నేను ఈ తప్పు చేసానని అనుకుంటున్నారా అని అనుపమని మను అడుగుతాడు. నువ్వు నా పెంపకంలో పెరిగావు.. ఎలాంటి తప్పు చెయ్యవని అనుపమ గన మనసులో అనుకుంటుంది. నాకు ప్రాణాలు తీసేంత కోపం ఎవరి మీద లేదు మేడమ్ ఒకే ఒక వ్యక్తి పైన ఉంది.. అది నా కన్నతండ్రి పైన మమ్మల్ని ఇలా ఎందుకు వదిలేసాడని కోపనని మను అనగానే... అనుపమ ఎమోషనల్ అవుతూ.. నీ తండ్రి పైన అలాంటి కోపం ఉంటే మానేసుకోమని చెప్పి వెళ్తుంటే.. ఇంతకు నేను ఈ తప్పు చేసానని మీరు అనుకుంటున్నారా లేదా అని చెప్పలేదని మను అడుగుతాడు లేదని అనుపమ చెప్పి వెళ్ళిపోతుంది.

మరొకవైపు శైలేంద్రని మహేంద్ర కలుస్తాడు. ఇదంతా నువ్వే చేసావ్ కదా అని అడుగుతాడు. ఎందుకు అలా అంటున్నారంటూ శైలేంద్ర అడుగుతాడు. ఎందుకు అంటే నువ్వే మాకు శత్రువు కాబట్టి ఎండీ పదవి కోసం ఏమైనా చేస్తావ్.. ఇప్పుడు మనుని దత్తత తీసుకుంటే నీకు ఎండీ పదవి దక్కదని ఇలా చేసావ్ కదా అని మహేంద్ర అంటాడు. మను కావాలనే రాజీవ్ ని షూట్ చేసాడేమో.. వసుధార అంటే రాజీవ్ కి ఇష్టం కదా వసుధారని ఇబ్బంది పెడుతున్నాడని అలా చేసి ఉండొచ్చు.. ఒకవేళ వసుధర పైన మనసు పడ్డాడేమోనని శైలేంద్ర అనగానే.. తన చెంప చెల్లుమనిపిస్తాడు మహేంద్ర. ఇంకొకసారి అలా మాట్లాడితే బాగుండదంటు మహేంద్ర వార్నింగ్ ఇస్తాడు. మనుని ఎలాగైనా బయటకు తీసుకొని వస్తానని మహేంద్ర అంటాడు. అ తర్వాత అనుపమ తన పెద్దమ్మ దగ్గరకి వచ్చి ఎమోషనల్ అవుతుంది. అక్కడే మహేంద్ర, వసుధార కూడా ఉంటారు. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.