English | Telugu

Guppedantha Manasu : మనుని అతడు విడిపిస్తాడా.. శైలేంద్ర  కాలేజీకి ఎండీ కాగలడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -1075 లో....శైలేంద్ర, వసుధార, మహేంద్ర లు స్టేషన్ లో ఉన్న మను దగ్గరికి వస్తారు. ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చావని శైలేంద్రని మహేంద్ర అడుగుతాడు. ఇదిగో అగ్రిమెంట్ పేపర్స్ దీనిపై సంతకం చెయ్యాలి మనుని బయటకు తీసుకొని వస్తాను.. మీరు నన్ను ఎండీగా చెయ్యాలని శైలేంద్ర అంటాడు.

ఆ తర్వాత ఈ మను యాభై కోట్లు ఇవ్వగానే.. కాలేజీ అప్పజెప్పి నెత్తిన పెట్టుకున్నారని శైలేంద్ర అంటాడు. నిజంగానే నన్ను బయటకు తీసుకొని వస్తావని నిన్ను ఎలా నమ్మాలని శైలేంద్రతో మను అంటాడు. నన్ను నమ్మి ఈ అగ్రిమెంట్ పేపర్స్ పై నువ్వు, వసుధార సంతకం చెయ్యండి అని శైలేంద్ర అంటాడు. ఎలా బయటకు తీసుకొని వస్తావని వసుధార అడుగుతుంది. అయితే మీరు మను యాభై కోట్లు ఇచ్చుకోండి.. కాలేజీ ని కూడ అప్పజెప్పుకోండి అని శైలేంద్ర వెటకారంగా మాట్లాడతాడు. వాళ్ళు నాకు యాభై కోట్లు ఇచ్చిన వెంటనే నీకు అవి ఇస్తాను అంతకన్నా ఎక్కవ ఇస్తాను.. నన్ను బయటకు తీసుకొని రా అని మను అంటాడు. నాకు ఎండీ పదవి కావాలి.. అది దక్కనప్పుడు ఇదంతా ఎందుకు? అసలు మీతో నాకు ఈ మీటింగ్ ఎందుకు? ఇక నువ్వు జైల్లోనే ఉండాలి.. నేను కాపాడ్తానంటే కాపాడనివ్వడం లేదని శైలేంద్ర అంటుంటే.. సరే నేను సంతకం పెడతానని మను సంతకం పెడతాడు... నువ్వు కూడా సంతకం పెట్టు అని అనగానే.. నేను పెట్టనని వసుధార అంటుంది. అయితే యాభై కోట్లు ఇవ్వండని మను అంటాడు.. అమ్మా వసుధార.. సంతకం పెట్టమ్మా అని మహేంద్ర అంటాడు.. అసలు ఈ శైలేంద్రకి ఏం అర్హత ఉంది ఇప్పుడు కూడా కాలేజీ గురించి మన కుటుంబం గురించి ఆలోచించడం లేదని తనకి కావలసిన పదవి గురించి ఆలోచిస్తున్నాడని వసుధార అంటుంది.

ఆ తర్వాత వసుధార కన్విన్స్ అయి సంతకం చెయ్యబోతుంటే.. మను ఆపుతాడు. తీరా సంతకం చేసాక నన్ను బయటకు తీసుకొని రాకుంటే ఎలా.. ముందు నన్ను బయటకు తీసుకొని రా.. ఆ తర్వాత కాలేజీని నీకు అప్పగిస్తానని మను అంటాడు. సరే అందుకు వసుధార నేను చెప్పునట్టు చేయాలని శైలేంద్ర అంటాడు. ఏంటని వసుధార అడుగతుంది.. ఆలోచించుకొని చెప్తానంటు శైలేంద్ర వెళ్తాడు. ఆ తర్వాత ఆ శైలేంద్ర ముందు నీతో అలా మాట్లాడుతుంటే చాలా కష్టం గా ఉందని మనుతో మహేంద్ర అంటాడు. నా కోసమే కదా సర్ ఇదంతా అని మను అంటాడు. ఆ తర్వాత కాబోయ్ ఎండీ అంటూ శైలేంద్ర ఇంటికి స్వీట్ తీసుకొని వెళ్లి దేవయాని, ధరణికి ఇస్తాడు. శైలేంద్ర ప్రవర్తన చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.