English | Telugu

Guppedantha Manasu : మను, వసుధార కలిసి రిషిని కనిపెడతారా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -1049 లో....అందరు భోజనం చేస్తుంటారు. రేపు అందరు కాలేజీకీ వసున్నారా అని మహేంద్ర వసుధారని అడుగుతాడు. పేరెంట్స్ లెక్చరర్ మీటింగ్ కదా అందరూ వస్తున్నారని వసుధార అంటుంది. అనుపమ వస్తున్నావా? మను కూడా వస్తున్నాడని మహేంద్ర అనగానే.. లేదు రావడం లేదని అనుపమ అంటుంది. రండి అని వసుధార రిక్వెస్ట్ చేస్తుంది. అనుపమ సైలెంట్ గా ఉండడంతో మౌనం అంగీకారం, వస్తుందిలే అందరం కలిసే వెళదామని మహేంద్ర అంటాడు.

మరొకవైపు ఇప్పుడు మనం సరైన దారిలో వెళ్తున్నాం.. ఇప్పుడు విజయం సాధిస్తామని దేవయాని అంటుంది. ఇప్పుడేం జరిగిందని అలా మాట్లాడుతున్నావని శైలేంద్ర అంటాడు. అసలు వసుధారని డాడ్ ఒక్క మాట అననివ్వలేదు. అంత మంచిగా ఉంటే ఎలా అమ్మ.. ఇలా ప్రతిదానికి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వెళ్తుంటే ఎలా? మనకు శత్రువులు వాళ్ళ కాదు డాడ్ నే అని శైలంద్ర ఫ్రస్ట్రేషన్ అవుతుంటాడు. డాడ్ ని ఆలా అనకు తను మంచిగ ఉన్నంతవరకే మన ఆటలు కొనసాగుతాయని దేవాయని అంటుంది. ఆయనకు ప్రేమించడం తెలుసు.. ద్వేషించడం తెలుసు.. నువు ఇంకొకసారి అలా అనకు. నిన్ను ఎండీ కుర్చీలో కూర్చొపెట్టాలి.. దానికి నా దగ్గర ఒక ఆయుధం ఉందని దేవయాని అంటుంది. ఆయుధం ఏంటని శైలేంద్ర అడుగుతాడు. చెప్తాను అది నీకు చాలా హెల్ప్ అవుతుందని దేవయాని అనగానే.. హెల్ప్ అంటే మీరు ఏదో చేస్తన్నారని అర్ధం అవుతుందంటూ ధరణి వస్తుంది. ఇక ధరణి తన వెటకారం మాటలతో వాళ్లకి చిరాకు తెపిస్తుంది.

అ తర్వాత మను దగ్గరికి వసుధార వస్తుంది. మేడన్ రెస్ట్ తీసుకుంటే బాగుండు.. ఎందుకు కాలేజీకీ రమ్మంటున్నారని వసుధారతో మను చెప్పగా.. మేడమ్ కి గాయం తగ్గిందని వసుధార అంటుంది. కాలేజీ లో దేవయాని గారు అన్న మాటల గురించి బాధపడ్డారు కదా అని మను అంటాడు. దాంతో రిషిపై ఉన్న ప్రేమని మనుకి చెప్తుంది వసుధార. సర్ ఎక్కడున్నా కనిపెట్టి తీసుకొద్దామని వసుధారకి మను చెప్తాడు. మరొకవైపు రాజీవ్ దేవయాని, శైలేంద్ర లు ఒక ప్లాన్ చేస్తారు. అ తర్వాత రాజీవ్ పేరెంట్స్ మీటింగ్ కి వెళ్లే పేరెంట్స్ తో మాట్లాడి.. వాళ్లకి డబ్బులిచ్చి తాను చెప్పినట్టు చెయ్యమని చెప్తాడు. మరుసటిరోజు ఉదయం కాలేజీలో పేరెంట్స్ , లెక్చరర్స్ మీటింగ్ కి అందరు వస్తారు. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.