English | Telugu

Guppedanatha Manasu:గుప్పెడంత మనసులో కీలక మలుపు..  విలన్ ని వెతుక్కుంటు వచ్చిన వాళ్ళిద్దరు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -970 లో.. రిషిని సేవ్ చేసిన ముసలి వాళ్ళ దగ్గరికి శైలేంద్ర వస్తాడు. శైలేంద్ర రావడంతో వాళ్లకి అతన్ని చూడగానే అనుమానం వస్తుంది. దాంతో ఎందుకు వచ్చావని అడుగుతారు. నడుము నొప్పిగా ఉంది వైద్యం కోసం వచ్చానని శైలేంద్ర అనగానే.. ఆ ముసలివాళ్ళు వైద్యం పేరిట శైలేంద్రని కర్రతో నడుముపై కొడుతుంటారు. ఎన్నో రోజుల పగతో ఉన్నట్లుగా ముసలి వాళ్ళు శైలేంద్రని కొడుతారు.

కాసేపటికి వైద్యం మధ్యలో ఆపితే నరాలు పని చెయ్యవని శైలేంద్రని ఆ ముసలాయన బెదిరిస్తాడు. ఆ తర్వాత శైలేంద్రకు బాడీ మొత్తం మసాజ్ చేస్తుంటారు. కొడితే కొట్టారు కానీ ఇలా బాగుందంటు శైలేంద్ర రిలాక్స్ అవుతున్న టైమ్ లో ముసలాయన సెకండ్ కోటింగ్ స్టార్ట్ చేస్తాడు. ఎడాపెడ ఆ ముసలాయన కొడుతుంటే శైలేంద్ర పడే బాధ వర్ణనాతీతం.. మరొకవైపు శైలేంద్ర ఎక్కడికి వెళ్ళాడంటు ధరణిని దేవయాని అడుగుతుంది. నాకేం తెలుసు ఏక్కడకైన వెళ్తుంటే.. నేను అడిగితే నీకెందుకు అంటారు కదా అని దేవయానితో ధరణి చెప్తుంది. అంటే నీ భర్త ఎక్కడికి వెళ్తున్నాడని నువ్వు తెలుసుకోవా? అయిన ఈ మధ్య మమ్మల్ని ఎదరించి మాట్లాడడం బాగా అలవాటైందని దేవాయని అంటుంది. అ తర్వాత శైలేంద్ర ఫోన్ కి దేవయాని కాల్ చేస్తుంది.‌ అప్పుడు ముసలావిడ ఫోన్ లిఫ్ట్ చేసి ఈ అబ్బాయికి నరాలు పని చెయ్యడం లేదని అనగానే.. మీరెవరని దేవయాని అడుగుతుంది. అలా‌ అనేసరికి వెంటనే శైలేంద్ర ఫోన్ తీసుకొని.. నీకు అన్ని తర్వాత చెప్తాను మమ్మీ అంటాడు.

ఆ తర్వాత శైలేంద్రకి వాళ్ళు ఇచ్చిన వైద్యం పూర్తవ్వగానే లేచి నిల్చొని.. మీకు రిషి అనే అతను తెలుసా అంటూ రిషి ఫోటో చూపిస్తాడు. ముసలివాళ్ళు శైలేంద్రపై డౌట్ రావడంతో తెలియదని చెప్తారు. అప్పుడే అక్కడికి వసుధార, ముకుల్ లు వస్తారు. వాళ్ళని అక్కడ చుసిన శైలేంద్ర షాక్ అవుతాడు. ఇద్దరి మధ్య మాటలు యుద్ధం జరుగుతుంది.. ముకుల్ ఇండైరక్ట్ గా శైలేంద్రకి కౌంటర్ వేస్తుంటాడు. ఆ తర్వాత శైలేంద్ర వెళ్ళిపోతాడు. ఏంటి వీళ్ళు నన్ను ఫాలో అవుతు ఉంటున్నారా అని శైలేంద్ర అనుకుంటాడు. అసలు రిషి వసుధార ఇంట్లోనే ఉంటాడా తెలుసుకోవాలి.. ఎలా తెలుసుకోవాలని శైలేంద్ర అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.