English | Telugu

Eto Vellipoyindhi Manasu : సీతాకాంత్ కి రామలక్ష్మి వార్నింగ్.. తను ఊటీ బ్రాంచ్ కి వెళ్ళిపోతుందట!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -345 లో.... సీఐ సీతాకాంత్ ఇంటికి వస్తాడు. తనని చూసి రామలక్ష్మి మైథిలి వేరు వేరు అని చెప్తాడో.. ఒకవేళ మైథిలి రామలక్ష్మిలు ఒకరే అని చెప్తాడో అని శ్రీలతతో శ్రీవల్లి అంటుంది. సీఐ తో రామలక్ష్మి రావడం చూసి ఇంకా టెన్షన్ పడతారు. తను ఎందుకు వస్తుంది. నేనే రామలక్ష్మిని.. వాళ్ళు నన్ను చంపాలని చూసారని చెప్తుందేమోనని శ్రీవల్లి అంటుంది. రామలక్ష్మి కోపంగా లోపలికి వస్తుంది. రామ్ ఎదరుపడి మేమే వస్తుంటే మీరే వచ్చారని అంటాడు. నువ్వు వెళ్లి కార్ లో కూర్చోమని రామ్ ని పంపిస్తుంది.

సీతాకాంత్ గారు అంటు గట్టిగా అరుస్తుంది. సీతాకాంత్ కిందకి వస్తాడు. మీకు ఎంత దైర్యం ఉంటే నాపై ఎంక్వయిరీ చేపిస్తారు. నేను మైథిలినీ కావాలంటే ఇవి చూడండి అంటూ పాస్ పోర్ట్ తను లండన్ లో చదువుకున్న సర్టిఫికెట్ చూపిస్తుంది. అందరు వాటిని చూస్తారు. మీపై పరువు నష్టం దావా వేస్తానని రామలక్ష్మి అనగానే సందీప్ వద్దని రిక్వెస్ట్ చేస్తాడు. సీఐ కూడా తను మైథిలీనే అని రామలక్ష్మి కాదని చెప్తాడు. దాంతో సీతాకాంత్ బాధపడతాడు. మీరు ప్రతిసారీ స్కూల్ కీ వచ్చి డిస్టబ్ చేస్తున్నారు.. అందుకే ఇక మీ బాబుకి టీసీ ఇస్తున్నానని రామలక్ష్మి చెప్తుంది. ఆ మాట రామ్ వింటాడు. రామలక్ష్మి కోపంగా అక్కడ నుండి వెళ్లిపోతుంది. సీతాకాంత్ షాక్ లోనే ఉండిపోతాడు

రామలక్ష్మి, ఫణీంద్రలు కార్ లో వెళ్తుంటారు. జరిగింది గుర్తు చేసుకొని రామలక్ష్మి బాధపడుతుంది. ఇలా సీతా సర్ కి దగ్గరగా ఉండి దూరంగా ఉండడం నా వళ్ళ కాదు.. నేనొక నిర్ణయం తీసుకున్నానని రామలక్ష్మి అనగానే ఏంటి అది అని ఫణీంద్ర అంటాడు. నేను ఉటీలోని బ్రాంచ్ కి వెళ్లి అక్కడే ఉంటాని రామలక్ష్మి అనగానే.. సరేనని ఫణీంద్ర అంటాడు. దానికి ఏర్పాట్లు చెయ్యండి అని రామలక్ష్మి చెప్తుంది. మరొకవైపు రామ్ లేడు అంటూ శ్రీవల్లి అందరితో చెప్పగానే అందరు రామ్ గురించి వెతుకుతారు. గదిలో ఒక మూలాన కూర్చొని ఏడుస్తుంటాడు. ఏమైందని సీతాకాంత్ అడుగగా.. నువ్వు మిస్ ని ఏదో అన్నావ్.. అందుకే నన్ను స్కూల్ నుండి పంపించిందని రామ్ బాధపడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu: మహా పెళ్ళికి అంతా ఫిక్స్.. చక్రిని ఆమె అర్థం చేసుకుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -12 లో.....మహా తన డ్రీమ్ గురించి భూషణ్ కి చెప్తుంది. డ్రీం లేదు ఏం లేదు ఫ్యామిలీ ని చూసుకుంటే సరిపోతుంది. నాకు నచ్చింది వండి పెడుతూ వెళ్ళేటప్పుడు బై చెప్పి వచ్చేటప్పుటికీ అందంగా రెడీ అయి ఉంటే చాలని చెప్పగానే వీడితో అనవసరంగా నా డ్రీమ్ గురించి చెప్పానని మహా అనుకుంటుంది. అదంతా చక్రి వింటాడు. మరొకవైపు మాధవ దగ్గరికి గాయత్రి వచ్చి.. ఈ పెళ్లి కూడా క్యాన్సిల్ అయ్యిందంట కదా అని చెప్పగానే అందరు షాక్ అవుతారు. ఏ సైలెంట్ గా ఉండు.. ఈ విషయం కన్నాకి తెలియదని మాధవ అంటాడు.

Brahmamudi: రాజ్ తీసిన యాడ్ సక్సెస్.. ధాన్యలక్ష్మి ఇచ్చిన బిగ్ ట్విస్ట్ అదే!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -911 లో..... అప్పు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఒకావిడని రౌడీలు వెంబడిస్తారు. అప్పుని చూసి ఆవిడ దగ్గరికి వచ్చి.. మేడం కాపాడండి అంటుంది. రౌడీలు పోలీసులని చూసి పారిపోతారు. మేడమ్ వాళ్ళు నా నగలు దొంగతనం చెయ్యాలని వెంబడిస్తున్నారని చెప్తుంది. దాంతో వాళ్ళని పట్టుకోమని కానిస్టేబుల్ కి చెప్తుంది అప్పు. చాలా థాంక్స్ మేడమ్ అని ఆవిడ చెప్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళాలి నేను డ్రాప్ చేస్తానని అప్పు అంటుంది. ఆవిడ ఇంటిముందు దింపుతుంది...

Illu illalu pillalu : ఇంగ్లీష్ టీచర్ గా సెలెక్ట్ అయిన శ్రీవల్లి బయటపడుతుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -349 లో..... ప్రేమ, నర్మద కలిసి డుప్లికేట్ డాక్టర్ ని తీసుకొని వచ్చి శ్రీవల్లిని భయపెడతారు. నీకు జ్వరం తగ్గింది కదా అక్క ఇక ఇంటర్వ్యూకి వెళదామని ఇద్దరు దగ్గరుండి మరి ఇంటర్వ్యూ కోసం స్కూల్ కి తీసుకొని వెళ్తారు. శ్రీవల్లి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి తన సర్టిఫికెట్లు ఇస్తుంది. టెల్ మీ యువర్ సెల్ఫ్ అని ప్రిన్సిపల్ అనగానే శ్రీవల్లికి ఏం చెయ్యాలో అర్థం కాదు. అసలు మీకు ఇంగ్లీష్ వచ్చా రాదా అని ప్రిన్సిపల్ అడుగుతాడు.