English | Telugu
గొడవపడిన ఇమ్మానుయేల్-యాదమ్మ రాజు..షాకైపోయిన వర్ష, స్టెల్లా
Updated : Sep 27, 2023
శ్రీదేవి డ్రామా కంపెనీలో కొత్త కాన్సెప్ట్ వచ్చింది. ఈటీవీ వాళ్ళు ఫస్ట్ టైం ఈ షోలో "ఖుషి కపుల్ కాన్సెప్ట్" పేరుతో ఒక సెగ్మెంట్ ఇచ్చారు. అందులో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఏ జోడి ఇస్తుందో వాళ్లకు 5 లక్ష కాష్ ప్రైజ్ ని అనౌన్స్ చేశారు. ఏక్నాథ్ - హారిక, రోహిత్ - మెరీనా, ఇమ్మానుయేల్ - వర్ష, ప్రీతి నిగమ్- నగేష్, స్టెల్లా- యాదమ్మ రాజు, అరియనా- పండు జోడీలు ఎంట్రీ ఇచ్చారు. తర్వాత పాత సీరియల్స్ లో ఎక్కువగా పోలీస్ గెటప్స్ లో నటించిన సాగర్ అలియాస్ ఆర్కే నాయుడు ఈ షోలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఏక్నాథ్ హారిక కోసం "జాబిలమ్మ నీకు అంత" అనే సాంగ్ ని పాడాడు.
ఆ తర్వాత వర్ష కోసం ఇమ్మానుయేల్ వెంకటేష్ సాంగ్ ఒకటి పాడి వినిపించాడు. పండు-ఆరియానా చేసిన రొమాంటిక్ డాన్స్ "పచ్చదనమే " సాంగ్ అందరికి నచ్చేసింది. దాంతో మెరీనా కామెంట్ కూడా ఇచ్చింది "మీరిద్దరూ చాలా క్యూట్ గా అనిపించారు డాన్స్ చేసేటప్పుడు" అని చెప్పింది. తర్వాత స్టెల్లా-యాదమ్మ రాజు జోడి కలిసి "హోయ్ రాజు కన్నుల్లో నువ్వే" సాంగ్ కి డాన్స్ చేశారు. వీళ్ళ పెర్ఫార్మెన్స్ తర్వాత ఇమ్మానుయేల్ కామెంట్ చేసాడు "సారీ మీ డాన్స్ నాకు నచ్చలేదు" అని చెప్పాడు. "ఇమ్మానుయేల్ నీకు నచ్చినా నచ్చకపోయినా 100 కి 1 మార్క్ అన్నా ఇవ్వాలి" అని చెప్పింది స్టెల్లా. తర్వాత యాదమ్మ రాజుకు, ఇమ్మానుయేల్ కి బాగా గొడవ జరిగింది. యాదమ్మ రాజు స్టెల్లాని తీసుకుని స్టేజి మీద నుంచి వెళ్ళిపోయాడు. ఇమ్మానుయేల్ తన జాకెట్ ని స్టేజి మీద విసిరిగొట్టి వెళ్లిపోయేసరికి వర్షా షాకై చూస్తూ ఉండిపోయింది. ఇంతకు వాళ్ళ మధ్య జరిగిన గొడవ ఏమిటి...ఏ జోడి క్యాష్ ప్రైజ్ ని గెలుచుకుంది అనే విషయం తెలియాలి అంటే సండే వరకు వెయిట్ చేయాలి. ఇక నెటిజన్స్ ఇదంతా షోలో స్టంట్ కోసమే కానీ వాళ్ళ మధ్య గొడవలాంటివేమీ ఉండవు అని కామెంట్స్ చేస్తున్నారు.