English | Telugu

ఢీ డ్యాన్స్ పండు నాన్నకు హార్ట్ స్ట్రోక్... ఎవ్వరికీ చెప్పొదన్న ప్రదీప్!

ఇటుక మీద ఇటుక పెట్టి అనే సాంగ్ ఎంత ట్రెండ్ అయ్యిందో అందరికీ తెలుసు. ఢీ షో పండు ఈ సాంగ్ కి అద్దిరిపోయే పెర్ఫార్మెన్స్ చేసాక చిన్నా పెద్దా చాలా మంది ఈ సాంగ్ ని చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఈ సాంగ్ ని బాగా వైరల్ చేశారు. అలాంటి పండు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూకి వచ్చాడు. "ఇటుక మీద ఇతుకు పెట్టి ఎన్ని ఇల్లులు కట్టారు ఇప్పటి వరకు" అని వర్ష అడిగేసరికి. ఇటుకులు పెట్టడమే సరిపోతోంది..ఇల్లు కట్టలేదు" అన్నాడు. వెంటనే వర్ష "బాబు ఇల్లు కట్టే టైపు కాదు.. ఇంట్లో దూరే రకం" అనేసరికి 'పిలిచి మరీ బాడ్ చేస్తున్నారు" అన్నాడు. "కొత్తగా బ్యాడ్ చేయాలా ఏంటి" అంది వర్ష నవ్వుతూ. "నేను కప్పు తీసుకునేవరకు ఏమీ అనను..కప్పు తీసుకున్నాక ఒక్కొక్కళ్ళను కప్పుతో కొడతాను" అన్నాడు పండు. "ఎనిమిదేళ్ల నుంచి నేను ఢీ చేస్తున్నా. ఈ సారి కప్పు నమదే...కొంతమంది డాన్స్ వేయట్లేదు అంటారు. ఏ జడ్జ్మెంట్ తో డాన్స్ లేదు అంటారో తెలీదు." అన్నాడు.

ప్రదీప్ తో చేశారు కదా మీ ర్యాపొ ఎలా ఉంది అని వర్ష అడిగింది. "మా నాన్నకు హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు ప్రదీప్ అన్న నాకు హెల్ప్ చేసాడు. ఆయనే ఈ విషయాలు ఎక్కడా చెప్పనివ్వరు." అన్నాడు. "లవ్ చేస్తున్నానని చెప్పి రిలేషన్స్ మెయింటెయిన్ చేయడం మీద అభిప్రాయం" అనేసరికి "నీకు అమ్మాయిలతో టైం స్పెండ్ చేయాలి అనే మైండ్ సెట్ లో ఉన్నప్పుడు నువ్వు లవ్ అని చెప్పుకోవడం వేస్ట్. నిజంగా ఎవరైనా మోసం చేస్తే ఖర్మ అని ఉంటుంది కదా అది వస్తుంది" అన్నాడు. "డబ్బుకు, మనుషులుకా.. ఎవరికీ విలువ ఇస్తావ్" అంది వర్ష. "ఈరోజుల్లో డబ్బులు లేకపోతే ఎవరూ విలువ ఇవ్వరు." అన్నాడు. "అసలు మీ సంపాదన ఎంత..ఇంత చేస్తున్నావ్ మరి " అంది. "నేను చేస్తోంది నా ఫామిలీ గురించి. నాకు ఇంతవరకు సొంత ఇల్లే లేదు" అన్నాడు పండు. "స్నేహితులు పొడిచే వెన్నుపోటు చాలా బాధ కలిగిస్తుంది..నీ లైఫ్ లో ఎప్పుడైనా అలాంటిది జరిగిందా " అంది వర్ష. "ఒకప్పుడు నేను ఫ్రెండ్స్ ని మెయింటైన్ చేశా. కొన్ని ప్రాబ్లమ్స్ వలన దూరమయ్యాను. అందుకే నేను ఎక్కువగా ఫ్రెండ్స్ ని చేసుకోను. నా చేతి మీద పచ్చబొట్టు ఉందిగా హరి అని అతనే" అన్నాడు పండు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.