English | Telugu
ఆ అమ్మాయిని కూడా మా అమ్మే తీసుకుపోయిందేమో..!
Updated : Sep 29, 2022
బుల్లితెర మీద పండగ వాతావరణం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. కొత్త కొత్త షోస్ కొత్త కాన్సెప్ట్స్ తో ఏ వారానికి ఆ వారం ముస్తాబై వస్తోంది. ఇక ఇప్పుడు ఆదివారం వచ్చిందంటే చాలు.. శ్రీదేవి డ్రామా కంపెనీ కోసం ఎదురుచూసేవాళ్ళు ఎక్కువైపోయారు. ఇప్పుడు ఈ వారం ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ ఐపోయింది.
మల్లెమాల వాళ్ళు బుల్లితెర సెలబ్రిటీస్ తో పాటు వాళ్ళ ఫామిలీస్ ని ఆహ్వానించి షోస్ చేయిస్తూ ఉంటారు. వారు కూడా బుల్లితెరఆర్టిస్టుల మీద పంచులు వేస్తూ ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. లేటెస్ట్ గా దసరా పండగ సందర్భంగా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో భాగంగా ‘మంగమ్మ గారి కొడుకు’ ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో స్టేజి పై డ్యాన్సర్ పండు తన ప్రేయసిని తలచుకుంటూ ఎమోషనల్ అవడం చూపించారు.
“ఊహ తెలియని టైంలో మా అమ్మ చనిపోయింది, తర్వాత అంతగా ఈ అమ్మాయిని ప్రేమించాను. అమ్మలా ఉంటానని చెప్పి ఆ అమ్మాయి నాకు ప్రామిస్ చేసింది. తల్లి, తల్లి అని పిలుచుకునేవాడిని. కానీ చివరికి ఆమె కూడా నన్నొదిలేసి నా తల్లి దగ్గరకే వెళ్ళిపోయింది.. తన కంటే బాగా ఆ అమ్మాయి చూసుకుంటుందనే కోపంతో మా అమ్మే తన దగ్గరకు తీసుకుపోయిందేమో” అంటూ పండు ఏడ్చేశాడు. ఇప్పుడు ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఎపిసోడ్ అక్టోబర్ 2న ఆదివారం రోజున ప్రసారం కానుంది.