English | Telugu

నాకు మళ్లీ కంటెస్టెంట్ గా చేయాలని ఉంది..కానీ ఓడిపోతానని భయంగా ఉంది!

ఢీ-15 ఛాంపియన్ షిప్ బ్యాటిల్ లేటెస్ట్ గా మరో టీజర్ ని రిలీజ్ చేసింది. కిరాక్‌ డ్యాన్స్ పెర్ఫార్మెన్సెస్ తో ఆడియన్స్ ని ఉర్రూతలూగిస్తున్న షో ‘ఢీ’. ఇప్పటికి 14 సీజన్స్ పూర్తి చేసుకుని ఆదివారం నుంచి సీజన్ 15 ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధమైపోయింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్‌ ప్రభుదేవా రాబోతున్నారు.

ఇండస్ట్రీలో టాప్ యాక్టర్స్ ఎంతోమందికి ఆయన డాన్స్ కోరియోగ్రఫీ కూడా చేశారు..అలాంటి ఇండియన్ మైకేల్ జాక్సన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కొరియోగ్రాఫర్ గా.. నటుడిగా.. దర్శకుడిగా.. ఆయన సత్తా చాటారు. నటుడిగా కొన్ని మూవీస్ లో కూడా యాక్ట్ చేసారు. ఇప్పుడు ఢీ-15 లో మెరవడానికి సిద్ధమయ్యారు. కింగ్ ఈజ్ బ్యాక్ అంటూ తనదైన స్టైల్ లో డైలాగ్ చెప్పి ఎంట్రీ ఇచ్చారు.

ఇక ఈ షోకి హోస్ట్ గా ప్రదీప్ మాచిరాజు అలరించడానికి సిద్దమయ్యాడు. అలాగే ఈ షో లేటెస్ట్ గా రిలీజ్ ఐన టీజర్ లో శ్రద్ధాదాస్ డాన్స్ చేస్తూ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా డాన్సర్స్ తో కలిసి స్టేజి మీదకు వచ్చి "నాకు కంటెస్టెంట్ గా మళ్లీ చేయాలనుంది..కానీ సెలెక్షన్స్ లోనే ఓడిపోతానని నాకు తెలుసు" అని ఒక డైలాగ్ వేసి అందరినీ నవ్వించారు.

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.