English | Telugu

బిగ్ బాస్ సీజన్-7 పై క్యాట్ రివ్యూ!

బిగ్ బాస్ సీజన్-7 పై క్యాట్ రివ్యూ ఇచ్చింది. అదే క్యాట్ గురించి దామిణి వాళ్ళ సిస్టర్ మౌనిమ రివ్యూ ఇచ్చింది. ప్రస్తుతం టెలివిజన్ రంగాన్ని ఏలేస్తున్న అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్. ఈ షోకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సెలబ్రిటీల దగ్గర నుండి కామన్ పీపుల్ వరకు అందరి కన్ను ఈ హౌజ్ వైపేనని అనడంలో ఆశ్చర్యం లేదు. బిగ్ బాస్ ఈ సీజన్ ఉల్టా పల్టాగా సాగుతుంది. అయితే ఇందులో మొదట వారం కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. రెండవ వారం షకీల, మూడవ వారం సింగర్ దామణి ఎలిమినేట్ అయ్యారు.

బిగ్ బాస్ లో వారం మొత్తం కంటెస్టెంట్స్ హౌస్ తమ పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను మెప్పించగలగాలి. అందులో కొంచెం అటు ఇటు అయిన ప్రేక్షకులకు తమపై ఆసక్తి పోతుంది. ఎవరైతే హౌజ్ లో మంచి ప్రవర్తన కలిగి ఉండి, టాస్క్ లో ఆటతీరు, మాటతీరుతో అందరిని మెప్పించగలిగాలి. అలా అయితేనే హౌజ్ లో కొనసాగుతారు. చివరగా ఎలిమినేట్ అయిన దామిణి హౌజ్ లో తన పర్ఫామెన్స్ లేకపోవడం, తోటి కంటెస్టెంట్స్ తో రూడ్ గా ప్రవర్తించడం లాంటివి నచ్చక ప్రేక్షకులు తనకి ఓట్ వేయలేదు. ఓటింగ్ లో లీస్ట్ లో ఉండటం వల్ల బయటకు వచ్చేసిందని అనడంలో ఆశ్చర్యం లేదు. ఇదంతా ప్రేక్షకులకు ఇప్పటికే అర్థం అయింది.

దామిణి వాళ్ళ సిస్టర్ మౌనిమ బిగ్ బాస్ షో మీద కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. తన పాయింటాఫ్ లో రివ్యూ ఇచ్చింది. కాగా ఇప్పుడు ఆ రివ్యూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నా క్యాట్ ఆ బ్యాగ్ నుండి బయటకు వచ్చేసింది. ఇన్ని రోజులు నేను క్యారీ చేస్తున్న స్ట్రెస్ ని తీసేసుకుంటాను. ఓపెనప్ అవుదామనుకుంటున్న అంటూ చెప్పింది మౌనిమ. బిగ్ బాస్ ఓట్లు అనేవి ఫేక్ అని, అఫీషియల్ ఓటింగ్స్ అంటూ ఏం ఉండవని, అనఫీషియల్ ఓటింగ్ నే లెక్కలోకి తీసుకుంటున్నారని చెప్పింది. హౌజ్ లో లవ్ ట్రాక్, తమ ఎక్స్ గురించి చెప్పుకోవడం, గొడవలు పడటం, టాస్క్ లలో ఒకరినొకరు తిట్టుకోవడం లాంటి కంటెంట్ పై ఆసక్తి తప్ప నాకు గేమ్ ఎక్కడ కన్పించలేదంటూ తన మనసులోని మాటలని చెప్పేసింది మౌనిమ. అయితే ఈ రివ్యూన చూసిన నెటిజన్లు.. ఆ విషయం ఇప్పుడు ఎందుకు చెప్తున్నారని, హౌజ్ లో పర్ఫామెన్స్ బాగాలేకపోతే ఎవరైనా బయటకు రావాల్సిందేనని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. కాగా ఇప్పుడు మౌనిమ ఇన్ స్టాగ్రామ్ లో చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.