English | Telugu

కంటెస్టెంట్స్ టాస్క్ లతో బిజీ.. బిగ్ బాస్ సరికొత్త గేమ్ ప్లాన్!

బిగ్ బాస్ ప్రతీరోజు సరికొత్త‌ టాస్క్ లతో ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే విన్నర్ కోసం‌ జరిగే రేస్ లో కంటెస్టెంట్స్ అంతా తమ‌ పర్ఫామెన్స్ తో ఆకట్టుకుంటున్నారు. నిన్న జరిగిన టాస్క్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ని కన్ఫెషన్ రూంకి పిలిచి, "ఎవరు గెలుస్తారో చెప్పి, మీ ఓట్ ని తెలియజేయండి"‌ అని అన్నాడు. అయితే మొదట ఈ టాస్క్ లో ఇనయా, రేవంత్ పాల్గొన్నారు. వీరిద్దరిలో ఇనయా ఓడిపోతుందని కీర్తిభట్ చెప్పగా, రేవంత్ ఓడిపోతాడని శ్రీసత్య, ఇనయా ఓడిపోతుందని శ్రీహాన్ ఇలా ఒక్కొక్కరుగా వచ్చి ఓట్ వేసారు.

"మీకు‌ బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ 'పిరమిడ్ పడొద్దు'. ఈ టాస్క్ లో పేపర్ కప్స్ తో పిరమిడ్ ని చేసి, దాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి కేటాయించిన పెడస్టియల్ మీద పెట్టాలి. అలా మొదట గేమ్ పూర్తి చేసినవాళ్ళే.. ఈ టాస్క్ విజేత" అని బిగ్ బాస్ చెప్పాడు. అయితే చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ టాస్క్ లో రేవంత్ విజయం సాధించాడు. టోటల్ అయిదుగురు ఓట్లు వేయగా, రేవంత్ కి ఎక్కువ ఓట్లు వచ్చాయి. అయితే ఈ టాస్క్ గెలిచినహౌస్ మేట్స్ ఒక లక్ష పదివేల రూపాయల ప్రైజ్ మనీని గెలుచుకున్నారు. ఆ తర్వాత బిగ్ బాస్ 'మనీ ట్రాన్స్‌ఫర్' టాస్క్ ఇచ్చాడు. ఇందులో శ్రీసత్య, శ్రీహాన్ ఒక జట్టుగా.. ఆదిరెడ్డి, కీర్తి భట్ ఒక జట్టుగా ఉన్నారు. కాగా ఈ టాస్క్ లో శ్రీహాన్, శ్రీసత్య కలిసి బాగా ఆడి, గెలిచారు.

ఆ తర్వాతి టాస్క్ 'పవర్ పంచ్', "పవర్ పంచ్ చేసి బ్యాగ్ లో ఉన్న ఇసుకని వారికిచ్చిన కంటైనర్ లో నింపాలి" అని బిగ్ బాస్ చెప్పాడు. ఇనయా, రేవంత్ టాస్క్ లో పాల్గొనగా కీర్తి భట్ సంచాలకులురాలిగా ఉంది. అయితే ఒక్కో కంటెస్టెంట్ ని కన్ఫెషన్ రూంకి పిలిచి "ఎవరు గెలుస్తారు" అని బిగ్ బాస్ అడిగాడు. దీంతో అందరూ రేవంత్ గెలుస్తాడని తమ ఓట్ ని తెలియజేసారు. అయితే ఈ టాస్క్ లో రేవంత్ గెలిచి, ప్రైజ్ మనీని సొంతం చేసుకున్నాడు.

Podharillu: మహా పెళ్ళికి అంతా ఫిక్స్.. చక్రిని ఆమె అర్థం చేసుకుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -12 లో.....మహా తన డ్రీమ్ గురించి భూషణ్ కి చెప్తుంది. డ్రీం లేదు ఏం లేదు ఫ్యామిలీ ని చూసుకుంటే సరిపోతుంది. నాకు నచ్చింది వండి పెడుతూ వెళ్ళేటప్పుడు బై చెప్పి వచ్చేటప్పుటికీ అందంగా రెడీ అయి ఉంటే చాలని చెప్పగానే వీడితో అనవసరంగా నా డ్రీమ్ గురించి చెప్పానని మహా అనుకుంటుంది. అదంతా చక్రి వింటాడు. మరొకవైపు మాధవ దగ్గరికి గాయత్రి వచ్చి.. ఈ పెళ్లి కూడా క్యాన్సిల్ అయ్యిందంట కదా అని చెప్పగానే అందరు షాక్ అవుతారు. ఏ సైలెంట్ గా ఉండు.. ఈ విషయం కన్నాకి తెలియదని మాధవ అంటాడు.

Brahmamudi: రాజ్ తీసిన యాడ్ సక్సెస్.. ధాన్యలక్ష్మి ఇచ్చిన బిగ్ ట్విస్ట్ అదే!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -911 లో..... అప్పు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఒకావిడని రౌడీలు వెంబడిస్తారు. అప్పుని చూసి ఆవిడ దగ్గరికి వచ్చి.. మేడం కాపాడండి అంటుంది. రౌడీలు పోలీసులని చూసి పారిపోతారు. మేడమ్ వాళ్ళు నా నగలు దొంగతనం చెయ్యాలని వెంబడిస్తున్నారని చెప్తుంది. దాంతో వాళ్ళని పట్టుకోమని కానిస్టేబుల్ కి చెప్తుంది అప్పు. చాలా థాంక్స్ మేడమ్ అని ఆవిడ చెప్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళాలి నేను డ్రాప్ చేస్తానని అప్పు అంటుంది. ఆవిడ ఇంటిముందు దింపుతుంది...

Illu illalu pillalu : ఇంగ్లీష్ టీచర్ గా సెలెక్ట్ అయిన శ్రీవల్లి బయటపడుతుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -349 లో..... ప్రేమ, నర్మద కలిసి డుప్లికేట్ డాక్టర్ ని తీసుకొని వచ్చి శ్రీవల్లిని భయపెడతారు. నీకు జ్వరం తగ్గింది కదా అక్క ఇక ఇంటర్వ్యూకి వెళదామని ఇద్దరు దగ్గరుండి మరి ఇంటర్వ్యూ కోసం స్కూల్ కి తీసుకొని వెళ్తారు. శ్రీవల్లి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి తన సర్టిఫికెట్లు ఇస్తుంది. టెల్ మీ యువర్ సెల్ఫ్ అని ప్రిన్సిపల్ అనగానే శ్రీవల్లికి ఏం చెయ్యాలో అర్థం కాదు. అసలు మీకు ఇంగ్లీష్ వచ్చా రాదా అని ప్రిన్సిపల్ అడుగుతాడు.