English | Telugu

బుల్లెట్  భాస్కర్ స్కిట్ ....అమ్మాయిలు కుక్కల్లా మీద పడతారంటూ డైలాగ్


ఒకప్పుడు జబర్దస్త్ అంటే చాలు హెల్తీ కామెడీతో ఫామిలీ మొత్తం చూసే పరిస్థితి ఉండేది. కానీ తర్వాత్తర్వాత ఆ వ్యవహారం మొత్తం మారిపోయింది. డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్కువైపోయి స్కిట్స్ , నవ్వులు తక్కువైపోయి కుళ్ళు కామెడీ పుట్టుకొచ్చింది. రాను రాను జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ లో కూడా లేడీస్ ని కించపరచడం, అవమానించడం, బాధ పడేలా ఉండే కామెంట్స్ చేయడం అది చూసిన జడ్జెస్ నవ్వేసరికి అదే కామెడీ అనుకునేలా క్రియేట్ చేయడం వంటివి జరుగుతున్నాయి.

రీసెంట్ గా ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమో రిలీజ్ అయ్యింది. అందులో బులెట్ భాస్కర్ - గడ్డం నవీన్ స్కిట్ కొంచెం ఎక్స్ట్రా గా ఉంది. ఈ స్కిట్ లో భాస్కర్ హీరోగా చేసాడు. బాడీ స్ప్రే యాడ్ లో నటించాడు. "ఒకప్పుడు నేను రోడ్డు మీద వెళ్తుంటే ఒక్క అమ్మాయి కూడా తిరిగి చూసేది కాదు. ఒక్కసారి ఈ స్ప్రే కొట్టా...కుక్కలు మీద పడినట్టు పడిపోయారు. భాస్కర్ స్ప్రే..నేను వాడాను..మరి మీరు" అని చెప్పిన డైలాగ్ మరీ టూమచ్ గా లేడీస్ ని కుక్కలతో పోల్చడం ఎబ్బెట్టుగా ఉంది.

అంతే కాదు దీనికి కంటిన్యుయేషన్ గా మరో కమెడియన్ వచ్చి "నువ్వు వాడిన స్ప్రే వాడితే అమ్మాయిలు కుక్కల్లా మీద పడతారని అన్నావ్ కదా" అనేసరికి "అమ్మాయిలు కరిచారా" అంటూ భాస్కర్ రివర్స్ లో అడిగాడు. "లేదు కుక్కలు సర్ కుక్కలు కరిచాయి" అనేసరికి జడ్జెస్ తో పాటు యాంకర్ రష్మీ కూడా నవ్వేసింది. ఇక స్టార్టింగ్ లో పటాస్ ప్రవీణ్ స్కిట్ మరీ ఫన్నీగా ఉంది.."జిన్నాబాయ్" గెటప్ లో అదే బ్యాక్ గ్రౌండ్ సాంగ్ తో స్టేజి మీదకు ఎంట్రీ ఇచ్చాడు. "వచ్చేటప్పుడు ఆ ఎంట్రీలో ఆ ఫ్లెక్సీ చూసా..అక్కడేంటి అన్ని కుక్కలు ఉన్నాయి" అని ప్రవీణ్ అడిగేసరికి "నీకు అభిషేకం జరుగుతుంది" అని రష్మీ చెప్పిన మాటకు అందరూ నవ్వేశారు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.