English | Telugu

Brahmamudi: కావ్య ప్రేమ కోసం రాజ్ విశ్వప్రయత్నం.. యామిని కొత్త ప్లాన్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి (Brahmamudi)'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-728లో.. యామిని, రుద్రాణి ఇద్దరు ఫోన్ లో మాట్లాడుకుంటారు. కావ్య, అపర్ణల మధ్య ఉన్న సంబంధం రాజ్ కళ్లముందే బయటపడటానికి నా మనిషిని ఒకరిని అక్కడికి ఒక ఆఫీసర్ లా పంపిస్తాను. అతడు జనాభా లెక్కల కోసం వచ్చినట్లుగా నటించి.. ఎవరికి ఎవరు ఏం అవుతారో అనే వివరాలు లాగుతాడు.అప్పుడు రాజ్ ముందే అపర్ణ గారు కళావతికి అత్త అన్న నిజం బయటపడుతుంది. కొడుకు పెళ్లామనే నిజం బయటపడుతుంది.. అప్పుడు రాజ్ నిజం తెలుసుకుని అందరిని తిట్టి నా దగ్గరకు వచ్చేస్తాడని యామిని తన ప్లాన్‌ని రుద్రాణికి చెప్తుంది.

మరోవైపు కావ్య కోసం రాజ్ లవ్ లెటర్ రాస్తాడు. అది ఫన్నీగా ఉంటుంది. అయితే లెటర్ చివర్లో కళ్యాణ్ అని రాసి ఉండటంతో అది చూసి కావ్య విసుగ్గా రాజ్ కి ఇచ్చేసి తిట్టేసి వెళ్ళిపోతుంది. ఇక ఆ పేరు చూసి రాజ్ కోపంతో‌‌.. ఒరేయ్ కళ్యాణ్ అంటూ తన వెంటపడతాడు. సారీ అన్నయ్య అలవాటులో పొరపాటుగా నా పేరు రాశేసానని కళ్యాణ్ చెప్పినా రాజ్ వినడు. ఇక కళ్యాణ్ ని స్విమ్మింగ్ పూల్ దగ్గర కిందపడేసి ఎంతపనిచేశావ్ రా అని రాజ్ అంటుంటే.. అపర్ణ, ఇందిరాదేవి ఆపేస్తారు. ఇక వారికి సారీ చెప్పేసి కొత్త ప్లాన్ చెప్పమంటాడు రాజ్. కాసేపు ఆలోచించిన రాజ్ నాకో కొత్త ఐడియా వచ్చిందని అనగానే.. హా ఏంటి అది అని కళ్యాణ్ అంటాడు. హా చెప్తే దాని మీద కూడా సంతకం చేస్తావా అంటూ కళ్యాణ్ మీద కోప్పడతాడు రాజ్. అదంతా దూరం నుండి కావ్య చూసి నవ్వుకుంటుంది‌.

ఇక కావ్యకి కాల్ చేస్తుంది యామిని.‌నీది అధర్మం.. నాది ధర్మం.. నేనే గెలుస్తానంటూ యామినిని రెచ్చగొట్టేలా కావ్య మాట్లాడుతుంది. అదే సమయంలో కావ్యకి సారీ చెప్తూ రాజ్ తనవెంట పడతాడు. రుద్రాణి, ఇందిరాదేవి అంతా రాజ్ కి సపోర్ట్ చేస్తూ డ్యాన్స్ చేస్తుంటారు. ఇక చివరికి కావ్య నవ్వేసరికి.. నవ్వింది.. కళావతి నవ్వింది అంటు రాజ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. అదే సమయంలో యామిని మనిషి జనాభా లెక్కల మనిషిలా ఇంటికి వస్తాడు. అతనికి రుద్రాణి సపోర్ట్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.