English | Telugu

Brahmamudi : నగలు కావ్యకి ఇచ్చేసిన ఇందిరాదేవి.. వాళ్ళ పరువుతీయాలని అనామిక స్కెచ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-622 లో....రాహుల్, రుద్రాణి కలిసి కావ్య నగలు తాకట్టు పెట్టి హాస్పిటల్ బిల్ కట్టిందని చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. ఇంట్లో అందరూ హ్యాపీగా ఉంటే మీరు చూడలేరా అని రుద్రాణి పై రాజ్ కోప్పడతాడు.

ఇక కావ్య అందరి ముందు తప్పు చేసిందానిలాగా ఉండకూడదని నేనే నగలు తాకట్టు పెట్టమని చెప్పాను.. అకౌంట్స్ అన్ని హోల్డ్ లో ఉన్నాయ్ కదా అందుకే అలా చెప్పానని అపర్ణ చెప్తుంది. ఏం చాకచక్యంగా సమాధానం చెప్పావని అపర్ణని అంటుంది రుద్రాణి. నీకేం హక్కు ఉందని నిలదీస్తున్నావ్ రుద్రాణి.. గేంటెస్తే బయటకు వెళ్లిపోతావంటూ రుద్రాణికి చివాట్లు పెడుతుంది అపర్ణ. మరి నగల గురించి అడిగినప్పుడే ఎందుకు చెప్పలేదని ధాన్యలక్ష్మి అడుగుతుంది. నాకు సెన్స్ ఉంది.. అప్పుడే చెప్తే ఈ రుద్రాణి అప్పుడే గొడవ చేసేదని అపర్ణ చెప్తుంది. ఆ తర్వాత రాహుల్, రుద్రాణిలు అవమానంగా ఫీల్ అయ్యి అక్కడ నుండి వెళ్లిపోతారు.

ఆ తర్వాత అపర్ణ, ఇందిరాదేవి కావ్య ఇంటికి వచ్చి మాట్లాడుకుంటారు. ఇప్పుడు అసలు నిజం చెప్పమని కావ్యని నిలదీస్తుంది అపర్ణ. కానీ కావ్య డైవర్ట్ చేస్తుంది. కావ్య చెప్పేది అయితే ఎప్పుడో చెప్పేది.. నువ్వు సైలెంట్ గా ఉండమని అపర్ణతో ఇందిరాదేవి అంటుంది. నాకేం జరిగుతుందోనని టెన్షన్ గా ఉంది నిజం చెప్పమని అపర్ణ అంటుంది. అయినా కావ్య చెప్పకపోవడంతో.. ఇక నువ్వు నాతో మాట్లాడకని అపర్ణ కోపంగా వెళ్లిపోతుంది. అసలు సమస్య ఏంటో ఇంటిపెద్దగా నేను కనుక్కోవాలని ఇందిరాదేవి అనుకుంటుంది.

ఆ తర్వాత రాజ్, కావ్య లు జరిగింది గుర్తుచేసుకుంటారు. ఈ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ వచ్చిందని రాజ్ అంటాడు. ఏంటని కావ్య అడుగగా.. ఇక నిజం అంతా ఇంట్లో వాళ్ళకి చెప్పేద్దామని అంటాడు. దానికి రుద్రాణి, ధాన్యలక్ష్మి లు ఎలా మాట్లాడుతారో కావ్య ఉహించుకొని చెప్తుంది. దాంతో వద్దని రాజ్ అంటాడు.

తరువాయి భాగంలో నీకు తోడుగా ఉంటానని ఇందిరాదేవి నగలు కావ్యకి ఇస్తుంది. మరొకవైపు రాజ్ వాళ్ళు అప్పులు చేస్తున్నారని ఈ విషయం మీడియాకి చెప్పి లైవ్ ని ఎంజాయ్ చేద్దామని సామంత్ తో చెప్తుంది అనామిక. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.