English | Telugu

Brahmamudi:మీ కూతురు పెళ్ళి తర్వాత నాకు ఇస్తానన్న రెండు కోట్లు ఇవ్వాలి!


స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -289 లో.. పద్మావతి నిద్ర లేచి ఏడుస్తుంటుంది‌. ఇక అప్పుడే విక్కీ నిద్రలేచి.. ఏమైందని అడుగుతాడు. నా జీవితాన్ని మీరు నాశనం చేశారని పద్మావతి అనగానే.. విక్కీకి అసలేం అర్థం అవ్వదు. అందుకే క్లారిటీగా అసలు ఏమైందో చెప్పమని అడుగుతాడు. మన పెళ్లి రోజు జరగాల్సిన ఫస్ట్ నైట్.. వీళ్ళ పెళ్ళి రాత్రి జరిగిందని అనగానే అంత అబద్దమని విక్కీ అంటాడు. అవునా అయితే మరి ఒక మూడు నెలలు ఆగండి, నా కడుపులో మీ బిడ్డ ఉందని చూపిస్తానని పద్మావతి ఏడుస్తూ అంటుంది. ఇక విక్కీ ఆలోచనలో పడతాడు.

మరొకవైపు కనకం అరుణ్ కి ఫుడ్ తీసుకొని వెళ్తుంది. అసలు తప్పు చెయ్యనట్లు అరుణ్ మాట తీరు ఉంటుంది. దాంతో కనకానికి మరింత కోపం వస్తుంది. అప్పుడే స్వప్న వచ్చి.. నా జీవితాన్ని ప్రాబ్లమ్స్ లోకి నెట్టావ్.. నువ్వు బ్రతకవద్దని స్వప్న అంటుంది. అందరికి నిజం ఋజువు అయ్యే వరకు వీడు ఉండాలని కనకం అంటుంది. మరొకవైపు సుబ్రహ్మణ్యం కోసం సేట్ రిసార్ట్ కి వస్తాడు. అ సేట్ కనకాన్ని పిలిచి.. ఇక్కడ సుబ్రహ్మణ్యం ఎక్కడ ఉన్నారు.. అదే పెళ్లి కూతురు అనామిక తండ్రి ఎక్కడ? నేను అతని ఫ్రెండ్ ని అని అనగానే.. కనకం డైరెక్ట్ గా వాళ్ళు ఉన్న రూమ్ దగ్గరకి తీసుకొని వెళ్తుంది. ఆ తర్వాత సేట్, అనామిక తండ్రి మాట్లాడుకుంటారు. " మీ కూతురు పెళ్లి అయిన మరుక్షణం నాకు ఇవ్వాల్సిన రెండు కోట్లు ఇస్తానని అన్నావ్. అందుకే వచ్చాను పెళ్లి అయ్యేవరకు ఇక్కడే ఉంటాను" అని అనామిక నాన్న సుబ్రహ్మణ్యంతో సేట్ అంటాడు. ఇక సుబ్రహ్మణ్యం టెన్షన్ పడుతుంటాడు.

మరొకవైపు పెళ్లిలో భాగంగా అన్నదమ్ములు ఎవరైనా సరే చెల్లికి గాని అక్కకు గాని గాజులు పెట్టి ఆశీర్వాదించాలని ఇందిరాదేవి చెప్తుంది. అ తర్వాత అనామికకి రాహుల్ గాజులు పెట్టి ఆశీర్వదిస్తాడు. అలాగే విక్కీ వాళ్ళ బావ కూడా అనామికకి గాజులు పెట్టి ఆశీర్వదిస్తాడు. కాసేపటి తర్వాత సుభాష్, ప్రకాష్‌ ఇద్దరు కనకానికి గాజులు పెట్టి ఆశీర్వదిస్తారు. అలా అనామిక-కళ్యాణ్ ల పెళ్లిలో ఇరు కుటుంబాలు సరదాగా ఉంటాయి. తరువాయి భాగంలో అందరు తమ జోడిలతో కలిసి స్టేజ్ మీద డాన్స్ చేస్తుంటారు. కళ్యాణ్, అనామిక‌ ఇద్దరు డాన్స్ చేస్తుంటే అప్పు.. వాళ్ళని ఆగమని చెప్పి స్టేజ్ మీదకి వెళ్లి కళ్యాణ్ ని హగ్ చేసుకుంటుంది. అది చూసి అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.