English | Telugu

మగాళ్ల మీద ఈగ వాలినా ఢిల్లీని తగలబెట్టేస్తా!

భూమి - గగన్ ల న్యూ ఇయర్ పార్టీ పేరుతో జీ తెలుగులో ఆదివారం ఒక ఈవెంట్ రాబోతోంది. దీనికి అనిమల్ మూవీ హీరో రన్బీర్ కపూర్ లా హర్విన్ వచ్చాడు. ఇక రాములమ్మల ఈర్య వచ్చింది. స్టేజి మీదకు వచ్చిన హర్విన్ గట్టిగా గన్ పట్టుకుని రన్బీర్ కపూర్ అని అరిచాడు. వెంటనే హోస్ట్ రవి ఐతే "ఖీర్ లో వేసే కిస్మిస్ అంత అంత ఉన్నావ్ నువ్వు రన్బీర్ కపూర్ ఆ" అని అడిగాడు. వెంటనే హర్విన్ కూడా తగ్గకుండా "పెళ్ళాం కొడితే బాత్ రూమ్ లోకి వెళ్లి ఏడ్చే వాడిలా ఉన్నావ్ నువ్వు యంకరా..బచ్చా చోటా బచ్చా " అని ఒక పెద్ద భారీ డైలాగ్ చెప్పి రవి పరువు తీసేసాడు. తర్వాత ఈర్య వచ్చి "ఐ యాం రాములమ్మ ఆ జై ని చూడు మా జానుని ఎంత క్షోభ పెడుతున్నాడో తెలుసా" అంది. "నీ ముఖం మీద వేసే మేకప్ అది గ్రాఫిక్" అన్నాడు ఈర్యతో. "హలో అక్కడికి మీ అబ్బాయిలందరూ అందగాళ్ళయినట్టు" అంటూ ఈర్య రివర్స్ డైలాగ్ వేసింది.

"మా మగాళ్ల మీద ఈగ వాలినా ఢిల్లీ తగలబెట్టేస్తా" అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు హర్విన్. "అసలేముందిరా మీ మగాళ్లలో అంత గొప్ప" అంటూ ఈర్య ఫైర్ అయ్యింది. "అసలు మీ ఆడోళ్ళంటేనే అన్యాయం, సెల్ ఫిష్ లు" అన్నాడు హర్విన్. "ఇంతకు మించి ఇంకొక్క మాట మాట్లాడినా ప్రాణం తీస్తా" అంది ఈర్య. ఇక నెటిజన్స్ ఐతే రకరకాల కామెంట్స్ తో పిల్లలని ఎంకరేజ్ చేస్తున్నారు. "అరే బుడ్డోడా నువ్వు మగాడ్రా బుజ్జి..నేను మగాణ్ణి, నేను మగాణ్ణి అని చెప్పావు నాకు అదే గుర్తొస్తుంది నిన్ను చూసినప్పుడల్లా...హర్విన్ అండ్ ఈర్య..లవ్ యు రా" అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.