English | Telugu

అంతగా డిలీట్ చేయాల్సి వస్తే తరుణ్ భాస్కర్ నంబర్ డిలీట్ చేస్తాను

సుమ అడ్డా షో ప్రతీ వారం ఎంటర్టైన్ చేస్తోంది. ఈ వారం కూడా మంచి కలర్ ఫుల్ గా ఈ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షో బలగం మూవీ టీమ్ వచ్చింది. కావ్య, ప్రియదర్శి, వేణు, రచ్చ రవి వచ్చారు. వీళ్లందరినీ కూర్చోబెట్టి సుమ కొన్ని ప్రశ్నలు అడిగింది.." మీ మొబైల్ లో పెర్మనెంట్ గా ఒక నంబర్ డిలీట్ చేసెయ్యాలి అంటే మీరు ఎవరి నంబర్ ని డిలీట్ చేసేస్తారు..తరుణ్ భాస్కర్, వేణు ..వీళ్లల్లో ఎవరు ?" అని ప్రియదర్శిని అడిగింది. తరుణ్ భాస్కర్ నంబర్ ని డిలీట్ చేసేస్తాను అని చెప్పాడు. ఆ మాటతో అక్కడ ఉన్నవాళ్ళంతా షాకయ్యారు.

"వేణు గారు మీరు ఈ వేదిక మీదనే వేణు వండర్స్ గా వచ్చారు. ఇప్పుడు వండర్ఫుల్ వేణు డైరెక్టర్ గా వచ్చారు. ఎలా అనిపిస్తోంది" అని సుమ అడిగేసరికి "జబర్దస్త్ అనే స్టేజి మాతోనే స్టార్ట్ అయ్యింది. అక్కడ మేము చేసి పది నిమిషాల స్కిట్ కూడా చిన్నపాటి డైరెక్షన్ లాంటిదే...ఈరోజు ఈ మూవీని ఇంత కంఫర్టబుల్ గా చేసాను అంటే దానికి జబర్దస్త్ స్కిట్స్ కూడా నాకు ఎంతో ఉపయోగపడ్డాయి. బలగం అనే చిన్న సినిమా ఇంత రీచ్ అయ్యిందంటే నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు." అని చెప్పాడు. ఇక ఈ షోలో ప్రియదర్శికి ఎమోషన్స్ చేసే టాస్క్ ఇచ్చింది సుమ. వేణుకి కమెడియన్ గా మంచి పేరు ఉందన్న సంగతి తెలిసిందే. అయితే వేణు ‘జబర్దస్త్’ లో టీమ్ లీడర్ గా చేసేటప్పుడు చాలామంది కమెడియన్స్ ను పరిచయం చేశాడు. ఇప్పుడు ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్ వైపు అడుగులు వేసి ‘బలగం’ అనే మూవీని ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చి మంచి సక్సెస్ ని అందుకున్నారు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.