English | Telugu

జోలపాట పాడి కూతురు కోసం సింగరైన బాలాదిత్య!

బాలాదిత్య ఎంత పెద్దవాడైనా ఇద్దరు పిల్లలకు తండ్రైనా కూడా ఇంకా బాలనటుడిగానే అందరికీ గుర్తొస్తాడు. బాలాదిత్య ఆల్ రౌండర్. బాలనటుడిగా సుమారు 40 సినిమాల్లో నటించాడు. ‘ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం’ మూవీతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి వచ్చాడు. తర్వాత ‘రౌడీగారి పెళ్ళాం’ ‘జంబలకిడి పంబ’ , అన్న, ‘ఆజ్ క గుండా రాజ్’ ‘హలో బ్రదర్’ ‘హిట్లర్’ ‘సమరసింహారెడ్డి’ లిటిల్ సోల్జర్స్ వంటి మూవీస్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాడు. లిటిల్ సోల్జర్స్ మూవీకి నంది అవార్డు అందుకున్నాడు. 1940 లో ఒక గ్రామం అనే మూవీకి నేషనల్ అవార్డును అందుకున్నాడు.

2003 లో ఇతను హీరోగా ‘చంటిగాడు’ అనే మూవీలో నటించాడు. రీసెంట్ గా " మా ఊరి పొలిమేర" అనే చిత్రంలో కూడా నటించాడు. హీరోగా మంచి బ్రేక్ రాకపోయేసరికి ఫైనల్ గా సీరియల్ ఆర్టిస్ట్ గా సెటిలయ్యాడు.. సావిత్రమ్మ గారి కొడుకు, శాంభవి వంటి సీరియల్స్ తో తెలుగు ఆడియన్స్ ని మెప్పించాడు. తర్వాత బిగ్ బాస్ సీజన్ 6 లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు. మంచి మార్క్స్ కూడా సంపాదించుకున్నాడు. హౌస్ నుంచి బయటకు వచ్చాక తన రెండో కూతురు యజ్ఞ విధాత్రి నామకరణ వేడుకను ఘనంగా నిర్వహించాడు. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అంతా ఈ ఫంక్షన్ కి వచ్చారు.

ఇప్పుడు బాలాదిత్య తన కూతురు కోసం సింగర్ కూడా అయ్యాడు. "నా చిట్టిగాడే..నా తల్లిగాడే..నా చిట్టితల్లిగాడే...నా పుత్రి వీడే...విధాత్రి వీడే..యజ్ఞ విధాత్రి వీడే.." అంటూ ఒక చిన్న జోలపాటను క్రియేట్ చేసి పాడాడు. బాలాదిత్య పాడుతున్నంత సేపూ..తన కూతురు చాలా ఆసక్తిగా రెప్ప వాల్చకుండా వాళ్ళ నాన్న పెదాల కదలికలనే చూస్తూ ఉండిపోయింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్ మాత్రం పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు. పాట బాగుంది..పాపా బాగుంది..పేరు బాగుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.