English | Telugu

భానుశ్రీ పాడిన పాటను ఫన్నీగా ట్రోల్ చేసిన అష్షు!

సోషల్ మీడియాలో అష్షు రెడ్డి ఏది చేసిన ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటుంది. బాత్ టబ్ లో స్నానం చేసినా, ఆర్జీవీతో బర్త్ డే సెలెబ్రేట్ చేసుకున్నా, పవన్ కళ్యాణ్ పేరు నడుము మీద వేయించుకున్నా ఏదో ఒక న్యూస్ తో రోజూ ట్రెండింగ్ లో ఉంటుంది.

ఇక ఇప్పుడు కూడా భానుశ్రీని ఇమిటేట్ చేస్తూ ఫుల్ వైరల్ అవుతోంది అష్షు. శ్రీదేవి డ్రామా కంపెనీలో రీసెంట్ గా ప్రసారమైన ఎపిసోడ్ లో యాక్టర్ భానుశ్రీ పవన్ కళ్యాణ్ మూవీ ‘తీన్ మార్’ నుంచి ‘గెలుపు తలుపులే’ అనే సాంగ్ పాడింది. ఇక ఆమె పాడిన తర్వాత జడ్జి ఇంద్రజ.. ‘పాటలో డెప్త్ కనబడుతోంది’ అని కామెంట్ చేసింది. ఇక ఈ బిట్ మీద సోషల్ మీడియాలో మీమ్స్ బాగా వస్తున్నాయి.

ఇదంతా ఒక ఎత్తు ఐతే అషూరెడ్డి భాను పడిన పాటనే ఫన్నీగా రీల్ గా చేసి తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. "నీకున్నంత ఎనర్జీ ఎవరికీ ఉండదు..ఈ రీల్ నీకోసమే డేడికేట్ చేస్తున్నా" అని ఒక టాగ్ లైన్ పెట్టింది ఈ వీడియోకి.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.