English | Telugu

ఏం మాట్లాడుతున్నావ్...యాంకర్ కి వార్నింగ్ ఇచ్చిన ఆరోహి!

బిగ్ బాస్ షో మీద ఎన్ని కామెంట్స్ వచ్చినా డోంట్ కేర్ అన్నట్టుగా దూసుకుపోతోంది. ఇక ఈ వారం ఎలిమినేషన్స్ మామూలుగానే జరిగిపోయాయి. ఆరోహి రావు హౌస్ లోంచి ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చేసింది. ఇక ఆమె బయటికి రావడంతోనే బీబీ కేఫ్ లో సంచలన కామెంట్స్ చేసింది.

శ్రీహాన్, కీర్తితో తాను ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాయని చెప్పింది. అలాగే మనీ కోసం, మంచి ఫామిలీ కోసం హౌస్ లోకి వెళ్ళానంది. "ఇండివిడ్యువల్ గేమ్ ఆపేసిన దగ్గర నుంచి నీ గ్రాఫ్ పడిపోయింది" అంటూ యాంకర్ అనేసరికి ఆరోహి ఆ విషయాన్ని కొట్టి పడేసింది. ఇక హౌస్ లో ఒక్కొక్కరి గురించి చెప్తూ వాళ్ళ ఫొటోస్ ని విరగొట్టేసింది. "సుదీప అక్క డామినేటింగ్ గా అనిపిస్తుంది. ఆమె వాయిస్ అంతే కానీ" అంటూ ఆమె ఫోటో విరగొట్టేసింది.

"హౌస్ లో ఉన్నన్ని రోజులు నామినేట్ చేశా కానీ ఈయన ఉండాలి ఆడాలి, ఆట తెలిసిన వ్యక్తి కాబట్టి" అంటూ రేవంత్ కి కాంప్లిమెంట్స్ ఇచ్చి ఫోటో పక్కన పెట్టింది. "శ్రీహాన్ చాలా బాగా ఆడతాడు. టాప్ 5 వరకు వెళ్తాడు అందులో డౌట్ లేదని చెప్పి" అతని ఫోటో పక్కన పెట్టింది. "హౌస్ లో ఆరోహి మితిమీరింది" అని అర్ధమవుతోంది అని యాంకర్ అనేసరికి "సూర్యది నాది ప్యూర్ ఫ్రెండ్ షిప్" అంది. "అంత ప్యూర్ అని ఎవరికీ అనిపించలేదు" అని సీరియస్ గా అడిగాడు యాంకర్.

పచ్చ కామెర్ల వాడికి లోకం మొత్తం పచ్చగా కనిపిస్తుంది. "చేసేది కరెక్ట్ ఐతే ఎవరూ మాట్లాడుకోరు కదా" అని రివర్స్ లో యాంకర్ అడిగేసరికి "అలా ఎవ్వరు అన్నా కూడా అస్సలు ఊరుకోను, అది ఇంటర్వ్యూ ఐనా సరే ఊరుకోను". "ఫైర్ బ్రాండ్ లా వెళ్లాను అలాగే బయటికి వచ్చాను" అంటూ సీరియస్ గా చెప్పింది ఆరోహి.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.