English | Telugu

బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయిన ఆరోహి!

'దసరా' పండుగ ముందుగానే వచ్చినట్టుగా ఆదివారం గ్రాండ్ గా మొదలైంది బిగ్ బాస్. నాగార్జున దసరా బుల్లోడిలా రెడీ అయ్యి వచ్చాడు. కొంతమంది సింగర్స్ వచ్చి పాటలతో అలరించారు.

నాగార్జున, కంటెస్టెంట్స్ ని రెండు టీంలుగా విభజించి వారితో 'బతుకమ్మ' ఆడించాడు. ఆ తర్వాత హౌస్ మేట్స్ తో మాట్లాడుతూ "విజయదశమి పండుగకి సరిగ్గా పది మంది నామినేషన్లో ఉన్నారు" అని సరదాగా అన్నాడు. నాగార్జున ఒక్కొక్కరి గురించి మాట్లాడుతుండగా,మధ్యలో గీతు మాట్లాడింది. దానికి నాగార్జున కోపగించుకున్నాడు. "నేను వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మధ్యలో మాట్లాడకు కూర్చో ఫస్ట్" అని అన్నాడు. ఆ తర్వాత కీర్తి భట్, చంటికి మధ్య ఉన్న 'మిస్ కమ్యూనికేషన్' ని దూరం చేసాడు. "హౌస్ లో ఎవరైనా సరే చూసింది మాత్రమే నమ్మండి. ఎవరితోనైనా గొడవలు ఉంటే వాళ్ళతో మాట్లాడుకొని వెంటనే సరిచేసుకోండి" అని కంటెస్టెంట్స్ తో చెప్పుకొచ్చాడు.

నామినేషన్స్ లో ఒక్కో గేమ్ లో ఒక్కొక్కరుగా సేవ్ అయ్యారు. చివరగా ఆరోహి ఎలిమినేట్ అయింది. "ఆరోహి ఇంట్లో వాళ్ళకి 'బై' చెప్పేసి వచ్చేయమ్మా" అని చెప్పాడు నాగార్జున.ఆరోహి ఎలిమినేట్ అయింది అనగానే కీర్తి భట్, సూర్య బాగా ఏడ్చేసారు. ఆ తర్వాత నాగార్జున దగ్గరకు వచ్చేసింది ఆరోహి. స్క్రీన్ మీద తన 'AV'చూపించగా,అది చూస్తూ ఏడ్చేసింది. ఆ తర్వాత "హౌస్ లో కల్మషం ఎవరు? స్వచ్ఛం ఎవరు?" అని నాగార్జున అడగగా.. "సూర్య, కీర్తి భట్, వాసంతి, మెరీనా-రోహిత్, శ్రీహాన్, ఆదిత్య స్వచ్ఛమైనవారు" అని చెప్పింది. "కీర్తి భట్ నన్ను అమ్మ లెక్కనే చూసుకునేది. నేను తిన్నానో లేదో అని, ఎక్కడ ఉన్నా వెతుక్కుంటూ వచ్చి మరి తినిపించేది. నాకు ఎప్పుడూ దగ్గరగా ఉండి చూసుకునేది" అని ఏడుస్తూ చెప్పుకొచ్చింది. "రేవంత్, చంటి, సుదీప, శ్రీసత్య, ఇనయ, గీతు కల్మషం కలవారు" అని చెప్పింది. "గీతు స్ట్రాంగ్. రేవంత్ చాలా సాఫ్ట్.. మాట తీరు కొంచెం మారాలి. శ్రీసత్య గాసిప్స్ క్వీన్. ఈ హౌస్ లో కీర్తి తర్వాత అర్థం చేసుకుంది ఇనయ" అంటూ ఒక్కొక్కరి గురించి చెప్పుకొచ్చింది. "ఇనయాతో నా పర్సనల్ విషయాలు కూడా పంచుకున్నాను.. చాలా దగ్గర అయ్యాం" అని ఆరోహిఅనగానే "మిస్ యూ" అంటూ ఇనయ ఏడ్చేసింది. ఆ తర్వాత నాగార్జున టైం అయిందని ఆరోహిని బయటకు పంపించేసాడు. అలా ఎలిమినేషన్ లో నాలుగవ కంటెస్టెంట్ గా బిగ్ బాస్ నుండి బయటకొచ్చేసింది ఆరోహి.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.