English | Telugu

ఇంట్లోవి వద్దట.. ఆర్డర్ చేసి తెప్పించుకోవడమే ముద్దట.. కూతురి మీద సుమ ఫైర్!


ఇంట్లో ఉండే కూతుళ్ళకు.. అమ్మలు ఎన్ని వెరైటీ వంటకాలు చేసి పెట్టినా తనివి తీరదు. "ఇవేనా ఇంకేం లేవా?" అని అడుగుతూనే ఉంటారు. అమ్మలు కూడా ఏం తక్కువ తినలేదు. అడిగితే గరిటెలుపట్టుకుని జాడించే వాళ్ళు కూడా ఉన్నారు.డైలీ లైఫ్ లో ప్రతీ ఇంట్లో జరిగే ఈ విషయాలను సుమ డబుల్ రోల్ లో ఒక చిన్న రీల్ చేసి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. 'అమ్మ v/s అమ్ము' పేరుతో "ఎవ్రీడే స్టోరీ ఆఫ్ మథర్స్ ఇన్ ఎవ్రీ హౌస్" అని కాప్షన్ పెట్టింది. అమ్ము డైనింగ్ టేబుల్ మీద ఉన్న వంటలన్నీ మూతలు తీసి చూసి... "ఇంకేం లేవా?" అని అడిగింది.

"ఇక్కడ అన్నీ ఉన్నాయి కదా.. సాంబార్, పాపడ్, పికిల్, దొండకాయ రోటి పచ్చడి, బెండకాయ ఫ్రై చాలా ఉన్నాయి కదా, ఇంకా నీకేం కావాలి?" అని అడిగింది తల్లి సుమ. "అంతేనా!" అని మళ్ళీ అమ్ము ముఖం చిరాగ్గా పెట్టి అడిగేసరికి గరిటె చూపించి, "ఇంకేం కావాలే.. పోనీ దోశ, పల్లీ చట్నీ, ఇడ్లీ, కొబ్బరి చట్నీ చేయనా.. పోనీ పూరి, కుర్మా అవీ వద్దంటే చికెన్ బిర్యాని.. వీటిల్లో ఏదన్నా చేయనా?" అనేసరికి, "వద్దు.. బయట నుంచి ఆర్డర్ చేసి తెప్పించుకోనా.. ఓటీపీ చెప్తావా?" అన‌డిగింది అమ్ము. దాంతో సీరియస్ అయ్యింది సుమ.

ఇలా ఒక రీల్ చేసి పెట్టేసరికి నెటిజన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. వాళ్ళ వాళ్ళ ఇళ్లల్లో కూడా ఇదే తంతు అని వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ని కామెంట్స్ రూపంలో చెప్తున్నారు. "ఈ రెస్టారెంట్స్ అన్నీ ఎలా నడుస్తున్నాయనుకుంటున్నావ్ సుమా.. మన పిల్లల వల్లే.. మన మనశ్శాంతి పోగొట్టుకోవాలంటే పిల్లల్ని కనాలి".. ఇలా ఫన్నీ కామెంట్స్ ఎన్నో వస్తున్నాయి ఈ రీల్ కి.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.