English | Telugu

హ్యాపీ బర్త్ డే అద్విత.. ఇది చాలు బిగ్ బాస్!

బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్టైన్మెంట్ తో పాటుగా ఎమోషనల్ సీన్స్ జరుగుతుంటాయి. ఇలాంటివి జరిగినప్పుడే బిగ్ బాస్ ని ప్రేక్షకులు ఎక్కువగా వీక్షిస్తున్నారు. అందుకనే హౌస్ లో ప్రతి ఒక్కరికి సర్ ప్రైజ్ ఇవ్వడంలో బిగ్ బాస్ సాటి ఎవరు రారు అనే చెప్పాలి.

బిగ్ బాస్ గత వారం జరిగిన ఫ్యామిలీ టాస్క్ లో భాగంగా అందరి ఫ్యామిలీలకు దగ్గరికి చేసి వారిలో ఉన్న ఎమోషన్స్ ని బయటపెట్టాడు. ఇలా ఎవరో ఒకరికి ఏదో ఒకటి సర్ ప్రైజ్ ఇస్తూ వస్తోన్నాడు బిగ్ బాస్. హౌస్ నుండి ఎలిమినేట్ అయిన నేహా చౌదరికి తన పుట్టినరోజు నాడు సర్ ప్రైజ్ ఇవ్వగా, శ్రీహాన్ కి మాత్రం పుట్టినరోజు రోజుకి ఎలాంటి సర్ ప్రైజ్ ఇవ్వలేదు. దీంతో హౌస్ మేట్స్ బర్త్ డే సెలబ్రేట్ చేసారు. కాగా ఆదిరెడ్డి కూతురు బర్త్ డే ఉండడంతో ఆదిరెడ్డి గత వారం బిగ్ బాస్ కి రిక్వెస్ట్ చేసుకున్నాడు. తన "నా కూతురు పుట్టిన రోజున తనని వీడియోలో చూడాలనుకుంటున్నా, తన బర్త్ డే సెలబ్రేషన్స్ మిస్ అవ్వొద్దు" అని ఆదిరెడ్డి, బిగ్ బాస్ ని చాలాసార్లు రిక్వెస్ట్ చేసాడు. కాగా నిన్న ఆదిరెడ్డి కూతురు పుట్టినరోజు కావడంతో, పాపతో కేక్ కట్ చేయించిన వీడియోని బిగ్ బాస్ టీవీలో చూపించాడు. ఈ వీడియోలో తన భార్య కవిత మాట్లాడుతూ, "మన కూతురు మొదటి పుట్టిన రోజున ఒక తండ్రిగా, నువ్వు పక్కన ఉండాలి‌. కానీ నువు బిగ్ బాస్ వెళ్ళావ్. అందులోకి వెళ్ళింది ఆమె కోసమే కదా, ఐ యామ్ హ్యాపీ" అని చెప్పింది‌. ఆ తర్వాత పాపతో కేక్ కట్ చేపించి, నీ బ్లెస్సింగ్స్ పాపకి ఎప్పుడు ఉండాలి అని చెప్పి దీవించమంది.

ఆ తర్వాత ఆదిరెడ్డి మాట్లాడుతూ, "హ్యాపీ బర్త్ డే అద్విత. థాంక్స్ బిగ్ బాస్. థాంక్స్ కవిత. ఇది చాలు బిగ్ బాస్. మీకు ఋణపడి ఉంటాను" అని ఆదిరెడ్డి అనగానే హౌస్ మేట్స్ అందరూ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. హౌస్ మేట్స్ అందరు ఒక్కసారిగా ఆదిరెడ్డి ని హగ్ చేసుకొని హ్యాపీ బర్త్ డే అద్విత అంటు విషెస్ చెప్పారు. ఇది నిన్నటి ఎపిసోడ్‌లో హైలైట్ గా నిలిచింది.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.