English | Telugu

ఆమె వల్లే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను...ఆదిరెడ్డి

"ఆదివారం విత్ స్టార్ మా పరివారం" లేటెస్ట్ వీక్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. విమెన్స్ డే సందర్భంగా రాబోతున్న ఈ ఎపిసోడ్ మంచి కలర్ ఫుల్ గా అంతే ఎమోషనల్ గా ఉంది. ఇందులో మానస్ వాళ్ళ అమ్మతో, తేజు వాళ్ళ అమ్మతో, ప్రభాకర్ తన కూతురితో, ఆదిరెడ్డి వాళ్ళ చెల్లెలితో, నటరాజ్ మాస్టర్ తన భార్య, కూతురితో, ఆర్జే చైతు తన బెస్ట్ ఫ్రెండ్ కాజల్ తో కలిసి ఈ స్టేజి మీదకు వచ్చారు. మానస్ వాళ్ళ అమ్మ చూడడానికి ఒక పెద్ద సెలెబ్రిటీల ఉన్నారని శ్రీముఖి పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చింది. "మానస్ వాళ్ళ అమ్మ ఓల్డ్ జనరేషన్, కేజీఎఫ్ మమ్మీ అనుకుంటున్నారేమో..కానీ పద్మిని గారు లేటెస్ట్ జనరేషన్ " అంటూ పొగడ్తలతో ముంచెత్తి ఆమెతో డాన్స్ చేయించింది. ఆదిరెడ్డి తన చెల్లి గురించి చెప్పాడు. ఆమెకు చూపు లేదు. ఆమె పెన్షన్ డబ్బుతోనే తాను బెంగళూరు వెళ్లినట్లు ఆమె పెన్షన్ డబ్బుతోనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినట్టు చెప్పుకొచ్చాడు. ఆమె వల్లనే తాను ఇక్కడి వరకు వచ్చినట్లు చెప్పాడు. ఇప్పుడు ఆమెను ఈ స్టేజి మీద నిలబెట్టాను అంటూ గర్వంగా చెప్పాడు.

తమ ఇంట్లో ముగ్గురు ఆడవాళ్లు ఇద్దరు అబ్బాయిలు అంతా ఆడవాళ్ళ డామినేషన్ అని ఆదిరెడ్డి అనేసరికి "మేము మీకంటే ఎందులోనూ తక్కువ కాము..ఆడపిల్లలం" అని స్ట్రాంగ్ గా కౌంటర్ వేసింది ఆదిరెడ్డి చెల్లి. " ధైర్యంగా ఉండాలి, స్ట్రాంగ్ గా ఉండాలి, ఏది వచ్చినా ఫేస్ చేయాలి ఇవన్నీ నేను నేర్చుకున్నది అమ్మ దగ్గరే..నాకొక బెస్ట్ ఫ్రెండ్ అంటే అది మా అమ్మే" అని చెప్తాను అంది తేజస్విని వాళ్ళ అమ్మ గురించి. తర్వాత తేజు "సిరిమల్లె మువ్వా..నా వాడు ఎవరే" అనే సాంగ్ కి డాన్స్ చేసేసరికి "ఏంట్రా అమర్ పెళ్లి చేసుకున్నాక పెళ్ళాన్ని ఇట్లా వదిలేస్తారా...చూడు ఇంకా నా వాడు ఎవరే అని పాడుకుంటోంది...కాపురం చేయట్లేదేమిట్రా నువ్వు" అని ఫన్నీగా అమర్ దీప్ మీద ఫైర్ అయ్యింది శ్రీముఖి. మానస్ వాళ్ళ అమ్మ ముఖచిత్రాన్ని గీసి రంగులు పూశాడు, ఆదిరెడ్డి తనకు వచ్చిన బిగ్ బాస్ డబ్బులతో తన చెల్లికి ఒక గోల్డ్ నెక్లెస్ తీసుకొచ్చి స్టేజి మీద ఇచ్చాడు. ప్రభాకర్ కూతురు బెస్ట్ మెమరీ ఫోటో లామినేషన్ ని ప్రెసెంట్ చేసింది. తాను ఈ స్టేజిలో ఉన్నానంటే కారణం నా వైఫ్ నా కూతురు అని నటరాజ్ మాస్టర్ తన భార్యకు గజ్జెలు తెచ్చి కాళ్ళకు కాట్టి ఈ స్టేజి మీద స్టెప్స్ వేయించాడు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.