English | Telugu

బ్రేకప్ ఐతే ఇలా ఏడుస్తుంది..శ్రీముఖి కోసం అబ్బాయిలు కొట్టుకోవాలి అమ్మాయిలు కాదు


ఆదివారం విత్ స్టార్ మా పరివారం ప్రోమో రిలీజ్ అయింది. ఇందులో "లోకల్ చిచ్చాస్ వెర్సెస్ పాన్ ఇండియా మచ్చాస్" మధ్య పోటీ జరిగింది. ఇక హోస్ట్ శ్రీముఖి రెడ్ కలర్ డ్రెస్ లో హాట్ మిర్చిలా ఉంది. అలాగే స్టార్ మా పరివారం వాళ్లకు ఒక టాస్క్ ఇచ్చింది. శ్రీముఖి ఫోటో ఒకటి తెచ్చి అందులో కళ్ళను తీసేసి ఆ ఫోటో మీద మంచి షేప్ తో ఎవరైతే కళ్ళను డ్రా చేస్తారో వాళ్ళు విన్ ఐనట్టు అంటూ పోటీ పెట్టింది.

ఆ తర్వాత నాగపంచమి సీరియల్ హీరో మోక్ష అలియాస్ ప్రిథ్వి ప్రిన్స్ శెట్టి బ్లాక్ మార్కర్ తో ఆ పిక్చర్ కళ్ళను డ్రా చేస్తాడు. "అదేంటి నా ఫేస్ లో కళ్ళ కింద క్యారీ బాగ్స్ వేశాడేంటి" అని కామెడీ చేసింది శ్రీముఖి. "కాదు లవ్ లో బ్రేకప్ ఐనప్పుడు" అని మోక్ష చెప్తుండగా "ఓహో బ్రేకప్ ఐనప్పుడు ఏడిస్తే నేను ఇలా ఉంటానా" అని శ్రీముఖి అనేసరికి అందరూ పడీపడీ నవ్వేశారు. ఇక శ్రీముఖి ఫేస్ కి కళ్ళను డ్రా చేస్తాం అంటూ అందమైన అమ్మాయిలూ పోటీలు పడి కొట్టుకునేసరికి మధ్యలో డాక్టర్ బాబు అలియాస్ నిరుపమ్ పరిటాల వచ్చి "శ్రీముఖి కోసం ఇద్దరబ్బాయిలు కొట్టుకోవచ్చు కానీ ఇద్దరమ్మాయిలు కొట్టుకోవడం ఏమిటి" అంటూ కౌంటర్ వేసాడు. ఇక శ్రీముఖి అవినాష్ మీద ఎక్స్ప్రెస్ హరి మీద ఫుల్ పంచులు వేసింది..అవినాష్ రెచ్చిపోయి పాన్ ఇండియా మచ్చాస్ యూత్ అసోసియేషన్ అనేసరికి "అది యూత్ లో ఉన్నప్పుడు పెట్టొచ్చు కదా భూతైపోయాక పెట్టాడు" అనేసరికి అవినాష్ షాకయ్యాడు. ఇలా ఈ షో ఈవారం ఎంటర్టైన్ చేయడానికి ఆదివారం ఉదయం రాబోతోంది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.