English | Telugu

వీలు చూసుకుని మా ఇంటికి భోజనానికి రా రవి....


మహిళా దినోత్సవం స్పెషల్ ఎపిసోడ్ గా జీ తెలుగులో "శివంగివె" అనే షో ప్రసారం కాబోతోంది. ఈ షో ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ షోకి ఎంతో మంది సెలబ్రిటీస్ వచ్చారు. అలాగే అలనాటి ఆరడగుల అందగాడైన నటుడు కృష్ణంరాజు సతీమణి శ్యామల కూడా ఈ షోకి గెస్ట్ గా వచ్చారు. ఇక హోస్ట్ రవిని ఆమె ప్రత్యేకంగా పలకరించిన తీరును రవి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు " ఈ అద్భుతమైన స్వీట్ లేడీని నేను షోలో కలిసాను.

ఆ క్షణంలో ఆమె నా కూతురు వియా గురించి అడిగారు... చాలా క్యూట్ గా ఉంటుంది ! ఎలా ఉంది బుజ్జిదీ? అని అడిగేసరికి నేను నిజంగా చాలా ఆశ్చర్యపోయాను. బాగుందమ్మా...మీ ఆశీస్సులు కావాలి తనకి" అని చెప్పాను. "వీలు చూసుకుని మీ ఫామిలీతో మా ఇంటికి భోజనానికి రండి అని ఇన్వైట్ చేశారు. శ్యామల గారి మనసు ఎంత గొప్పదో అప్పుడు నాకు అర్ధమయ్యింది" అని చెప్పాడు రవి. ఈ షో 10వ తేదీ సాయంత్రం 6 గంటలకు ప్రసారం కాబోతోంది. అలాగే ఈ షోకి బాహుబలి తాలిని కూడా తీసుకొచ్చి అందరికీ వడ్డించారు శ్యామల. ఇక రవి పెట్టిన ఈ పోస్ట్ కి నెటిజన్స్ కూడా పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు. "అన్నా అసలు మిస్ అవ్వదు ఆ ఛాన్స్ ని మాకు ఎలాగో ఉండదు సో మీరైనా వెళ్ళండి...పెద్దమ్మగారు మంచితనానికి మారుపేరు...ఇంత మంచి ఫ్యామిలీ కాబట్టే ప్రభాస్ ఇప్పుడు ఇంత పెద్ద స్టార్ అయ్యాడు. ప్రభాస్ ఆయన ఫామిలీ ఎప్పుడూ బాగుండాలి. నిజమైన రాజుల ప్రేమ అలానే ఉంటుంది. వాళ్ళ రక్తంలోనే ఉంటుంది. ఆమె చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు." అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.