సడెన్ గా క్రేజీ ప్రాజెక్ట్ ని ఆపేసిన మైత్రి.. అసలేం జరిగింది?
'డాన్ శీను', 'బలుపు', 'క్రాక్' వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేని నాలుగోసారి చేతులు కలిపిన సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ప్రకటనతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. మాస్ రాజా-మలినేని కాంబోలో నాలుగో హిట్ రావడం ఖాయమనే అంచనాలు అందరిలో ఏర్పడ్డాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ వినిపిస్తోంది. అదేంటంటే ఈ సినిమా ఆగిపోయిందట.