English | Telugu

వైవిఎస్ చౌదరి ఇంట్లో విషాదం.. అన్న ఎన్టీఆర్ గారిని కలవడానికి వెళ్లారు

పాత తరం నటులతోనే కాదు కొత్త వాళ్లతోను సినిమాలు తెరకెక్కించి సెల్యులాయిడ్ పై వాటిని మరుపురాని చిత్రాలుగా మలచగల దర్శకుల్లో 'వైవిఎస్ చౌదరి'(Yvs Chowdary)ప్రధమ స్థానంలో ఉంటాడనడంలో ఎలాంటి సందేహం లేదు. నిన్న రాత్రి ఆయన తల్లి 'యలమంచిలి రత్నకుమారి'(Y. Rathnakumari)గారు చనిపోవడం జరిగింది. తల్లి మరణంపై ఆయన స్పందిస్తూ,మన పెద్దలు కొంత మందిని చూసి ‘పొట్ట కోస్తే అక్షరం ముక్క రాదు, ఎందుకు పనికొస్తార్రా మీరు? అంటూ చదువుకోనివాళ్ళని చూసి మందలిస్తూండేవారు.

ఆ సామెతకి అచ్చు గుద్దినట్లు సరిపోయే స్త్రీశక్తే మా అమ్మ. ఒక లారీడ్రైవర్‌ అయిన మా నాన్న ‘యలమంచిలి నారాయణరావు’గారి నెలసరి సంపాదనతో, తన ముగ్గురు బిడ్డలకి పౌష్టికాహారం, బట్టలు, అద్దె ఇల్లు, విద్య, వైద్యంతో పాటు.. సినిమాలు చూపించడం నుండీ దేవాలయ దర్శనాలు, సీజనల్‌ పిండివంటలు, నిలవ పచ్చళ్ళు, పండుగలకు ప్రత్యేక వంటకాలు, సెలబ్రేషన్స్.. ఇత్యాది అవసరాలకు.. తన నోటి మీది లెక్కలతో బడ్జెట్‌ని కేటాయించిన ఆర్ధిక రంగ నిపుణురాలు మా అమ్మగారు. వీటన్నింటికీ మించి నిత్యం తెల్లవారుజామునే లేస్తూ పనిమనిషి ప్రమేయం లేని జీవితాన్ని తన బిడ్డలకు అందించాలి అనే తపనతో.. అన్నీ తానై మమ్మల్ని పెంచటానికి తన జీవితాన్ని అంకితం చేసిన ఆదర్శమూర్తి మా అమ్మగారు. అలా మా అమ్మగారికి తెలిసిన లెక్కలు, ఆవిడ మమ్మల్ని పెంచిన విధానం ఏ చదువూ, ఏ విద్యా నేర్పించలేనిది. అంతేగాకుండా తన యొక్క ఆ విధానాలతో మాలో కూడా ఆ స్ఫూర్తిని నింపిన మహనీయురాలు మా అమ్మ.

అటువంటి మా అమ్మగారు (88 యేళ్ళు) ఈ గురువారం, 25వ సెప్టెంబరు 2025, సాయంత్రం గం8.31ని॥లకు.. ఈ భువి నుండి సెలవు తీసుకుని.. ఆ దివిలో ఉన్న మా నాన్నగారిని, మా అన్నగారిని కలవడానికి వెళ్ళిపోయారు అని తెలిపారు. వైవిఎస్ చౌదరి ప్రస్తుతం విశ్వ విఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ నందమూరి తారక రామారావు(Ntr)గారి మునిమనవడు తారకరామారావు తో ఒక మూవీ చేస్తున్నాడు. ప్రముఖ నృత్య కళాకారిణి వీణారావు హీరోయిన్ గా చేస్తుండగా, అచ్చ తెలుగు కథతో తెలుగు నేటివిటీ తో ఈ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నాడు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది. ఎన్టీఆర్ కి వైవిఎస్ చౌదరి వీరాభిమాని అనే విషయం తెలిసిందే.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.