English | Telugu

విక్రమ్ సినిమాలో ఇవి ఉండాల్సిందే..!!

సినీ పరిశ్రమలో సెంటిమెంట్లకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అక్షరాలు, నంబర్లు, షూటింగ్ స్పాట్‌లు, హీరో, హీరోయిన్లు, ఆర్టిస్టులు చివరకు పెంపుడు జంతువులు.. ఇలా ప్రతిదానికి విలువెక్కువే. చేసినవి తక్కువ సినిమాలే అయినా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు విక్రమ్ కే.కుమార్. పైకి చాలా క్లాస్‌గా కనిపించే ఈయనకి సెంటిమెంట్ల మీద గురి ఎక్కువే. తన సినిమాలలో ఏదో ఒక వస్తువుని హైలెట్ చేయడం విక్రమ్‌కి అలవాటు.

తొలి సినిమా "13"లో టీవీ హైలెట్‌గా నిలిచిపోయింది. జరిగినది, జరగబోయేది ముందుగా చూపిస్తూ ఆడియన్స్‌ని టెన్షన్ పెట్టింది ఆ టీవీ. ఆ తర్వాత అక్కినేని మూడు తరాల క్లాసిక్‌ "మనం"లో క్లాక్‌ టవర్‌ను వాడాడు. ఇక తమిళ స్టార్ హీరో సూర్యతో తీసిన "24"లో మెయిన్ ఎలిమెంట్ వాచ్. ఆ వాచ్ చుట్టూనే సినిమా మొత్తం తిరుగుతుంది. రీసెంట్‌గా అక్కినేని అఖిల్‌తో తీస్తున్న "హలో" మూవీలోనూ ఒక మొబైల్‌ చుట్టూ స్క్రీన్‌ప్లే తిప్పనున్నాడు విక్రమ్ కుమార్. ట్రైలర్‌ చూస్తే ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మరి మొబైల్ ఫోన్‌తో విక్రమ్ ఏం మ్యాజిక్ చేశాడో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.