English | Telugu

వెంకటేష్ కుటుంబంలో తీవ్ర విషాదం.. తను లేని లోటుని ఎవరు తీర్చలేరు

సినిమాల పరంగా చూసుకుంటే విక్టరీ వెంకటేష్(Venkatesh)తన అప్ కమింగ్ మూవీని 'త్రివిక్రమ్'(Trivikram)దర్శకత్వంలో చేస్తున్నాడు. వెంకటేష్ కెరీర్ లో 'నువ్వు నాకు నచ్చావు. మల్లేశ్వరి' మంచి హిట్స్ గా నిలిచాయి. ఈ రెండు చిత్రాలకి త్రివిక్రమ్ రచయితగా వ్యవహరించాడు. దీంతో ఈ కాంబో సిల్వర్ స్క్రీన్ పై ఎలాంటి మాయా జాలాన్ని ప్రదర్శిస్తుందనే ఆసక్తి అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను ఉండగా, త్వరలోనే షూటింగ్ కి వెళ్లనుంది.

రీసెంట్ గా వెంకటేష్ పెంపుడు శునకం గూగుల్(Google)చనిపోయింది. ఈ విషయంపై వెంకటేష్ ఇన్ స్టాగ్రామ్(Instagram)వేదికగా స్పందిస్తు 'నా నమ్మకమైన, ప్రియమైన గూగుల్. గత 12 ఏళ్లుగా మా జీవితాల్లో భాగమయ్యావు. ఎంతో ప్రేమని పంచావు. ఎన్నో అందమైన జ్ఞాపకాలు కూడా ఇచ్చావు. నువ్వే మా సన్‌షైన్. ఇక నీకు వీడ్కోలు. నువ్వు లేని లోటు మాటల్లో చెప్పలేనిది. నేను నిన్ను ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను డియర్ ఫ్రెండ్ అంటూ వెంకటేష్ గూగుల్ తో తాను దిగిన పిక్స్ తో నోట్ ని రాసుకొస్తు షేర్ చేసాడు.

ఇక త్రివిక్రమ్ తర్వాత 'వివి వినాయక్'(VV Vinayak)దర్శకత్వంలో వెంకటేష్ తన తదుపరి చిత్రాన్ని చేయబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి. గతంలో ఈ ఇద్దరి కాంబోలో 'లక్ష్మి' వచ్చి వెంకటేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన విషయం తెలిసిందే.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.