English | Telugu

పూరితోనే వరుణ్ రెండో సినిమా..!

మెగా బ్రదర్ నాగ బాబు కొడుకు వరుణ్ తేజ మొదటి సినిమా పూరి జగన్నాథ్ తో చెయ్యాల్సింది. కానీ అనుకొని కారణాలవల్ల ఆ చాన్స్ శ్రీకాంత్ అడ్డాలకి దొరికింది. ఇప్పుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'ముకుంద'గా టాలీవుడ్ కి పరిచయమవుతున్నాడు వరుణ్ తేజ. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ వేగంగా జరుగుతోంది. ఈ సినిమా తరువాత వరుణ్ తేజ పూరి జగన్నాథ్ దర్శకత్వంలోనే చేస్తాడని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన కథ కూడా సిద్దంగా వుందట. 'హార్ట్ ఎటాక్' సినిమా చేసిన తరువాత విరామం తీసుకున్న పూరి ఆ గ్యాప్ లో ఈ కథని రాసాడంట. ఈ కథకి మెగా ఫ్యామిలీ తో పాటు వరుణ్ తేజ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.