English | Telugu

ఎట్టకేలకు త్రివిక్రమ్ సినిమాకి ముహూర్తం ఖరారు!

త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ ఇంతవరకు ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ, త్రివిక్రమ్ రచయితగా వ్యవహరించిన 'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరి' వంటి సినిమాల్లో నటించాడు వెంకీ మామ. ఈ సినిమాలు ఆల్ టైం ఎంటర్టైనర్స్ గా పేరు పొందాయి. ఇప్పటికీ ఈ చిత్రాలను ఆడియన్స్ రిపీటెడ్ గా చూస్తుంటారు. అందుకే వెంకటేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా వస్తే చూడాలని ఎందరో ఆశ పడుతున్నారు. అభిమానుల కోరిక త్వరలోనే తీరబోతుంది. త్రివిక్రమ్ డైరెక్షన్ లో వెంకీ మామ ఓ మూవీ చేయబోతున్నాడు.

ఈ ఏడాది 'సంక్రాంతికి వస్తున్నాం'తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ని అందుకొని వెంకటేష్ ఫుల్ జోష్ లో ఉన్నాడు. దీంతో దాని తర్వాత వెంకీ మామ చేయబోయే సినిమా ఏంటని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. ఇలాంటి టైంలో అనూహ్యంగా త్రివిక్రమ్-వెంకటేష్ కాంబో తెరపైకి వచ్చింది. త్రివిక్రమ్ నెక్స్ట్ రెండు సినిమాలు వెంకటేష్, ఎన్టీఆర్ తో ఉంటాయని ఇప్పటికే నిర్మాత నాగవంశీ కూడా తెలిపాడు. అందుకు తగ్గట్టుగానే ముందుగా వెంకీ మామ మూవీ పట్టాలెక్కుతోంది. ఆగస్టులో ఈ సినిమా ప్రారంభం కానుందని తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందని సమాచారం.

వెంకటేష్ ప్రాజెక్ట్ తర్వాత ఎన్టీఆర్ ప్రాజెక్ట్ తో బిజీ కానున్నాడు త్రివిక్రమ్. ఇది భారీ బడ్జెట్ మైథలాజికల్ ఫిల్మ్. గాడ్ ఆఫ్ వార్ కుమారస్వామి కథతో ఇది తెరకెక్కనుంది.

ఎన్టీఆర్ ఈ ఆగస్టులో వార్-2 తో ప్రేక్షకులను పలకరించనున్నాడు. అలాగే ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో డ్రాగన్ చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే జూన్ 25న విడుదల కానుంది. ఆ తర్వాత త్రివిక్రమ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందేమో చూడాలి. మరోవైపు దేవర-2, డైరెక్టర్ నెల్సన్ ప్రాజెక్ట్ కూడా ఎన్టీఆర్ చేతిలో ఉన్నాయి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.