English | Telugu

దెయ్యంపై మనసుపడ్డ త్రిష

చెన్నై ముద్దుగుమ్మ త్రిష ఇప్పుడు చాలా సెలక్టివ్ గా మారిపోయింది. వరుణ్ మనియన్ తో పెళ్లి నిశ్చితార్ధమవగానే, తన సినిమాలన్నింటినీ వేగంగా పూర్తి చేసుకుని, కొత్త సినిమాలను కూడా తగ్గించుకుంది. కానీ, వారిద్దరి బంధానికి ఫుల్ స్టాప్ పడటంతో, తిరిగి కెరీర్ మీద దృష్టి పెట్టిందీ తమిళ భామ. ఒకప్పటిలా కాకపోయినా, త్రిషకు ఇప్పుడు కూడా బాగానే ఆఫర్లు వస్తున్నాయి. కానీ విచిత్రంగా ఇప్పటి వరకూ తను యాక్ట్ చేయని హార్రర్, హార్రర్ కామెడీ జానర్లను వరసగా ఎంచుకుంటోంది.

ఈ మధ్య ఇవి ఆడుతున్నాయి కదా అని ధైర్యమో లేక యాక్టింగ్ కు స్కోప్ ఉంటుందని నమ్మకమో గానీ, దెయ్యాల సినిమాపై ప్రేమను తెగ పెంచేసుకుంది.తాజాగా రిలీజై ఫర్లేదనిపించుకున్న హర్రర్ మూవీ 'కళావతి' తర్వాత, 'నాయకి' అనే మరో హర్రర్ సినిమాకు సైన్ చేసింది. ఇది హర్రర్ లోనే కామెడీ జానర్ లో ఉండబోతోందట. ఈ మూవీ తర్వాత,తన కెరీర్ తిరిగి ఊపందుకుంటుందన్న ఆశతో ఉందీ చెన్నై చిన్నది. ఈ సినిమాలో త్రిష రెండు పాత్రల్లో కనిపించనుండటం విశేషం.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.