English | Telugu

బాబాయ్ అబ్బాయ్‌లపై రవితేజ ఇన్‌డైరెక్ట్ కామెంట్?

రవితేజ..తెలుగు చిత్రపరిశ్రమలో గాడ్ ఫాదర్ లేకుండా ఎదిగి హీరోగా తనకంటూ సెపరేట్ స్టైల్, మ్యానరిజమ్‌తో దూసుకుపోతున్న స్టార్. అందరు హీరోలతో కలివిడిగా ఉంటూ ఫ్రెండ్లీ వాతావరణాన్ని క్రియేట్ చేస్తాడు రవి. ఎప్పుడూ ఎవరిని పల్లెత్తు మాట అనని రవి తాజాగా చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో చర్చకు దారి తీసింది.

కేవలం మాస్‌ని దృష్టిలో పెట్టుకుని మాస్ సినిమాలతో బాలీవుడ్‌లో సినిమాలు చేస్తే ఫలితం వేరేలా ఉంటుంది, వైవిధ్యమైన కథలతో బాలీవుడ్‌లో సినిమాలు చేయడం బెటర్‌ అంటూ కామెంట్ చేశాడు. దీనిని బట్టి చూస్తే రవితేజ పవన్, రామ్ చరణ్‌లపై ఇన్‌డైరెక్ట్‌గా సెటైర్ వేసినట్లుంది. ఎందుకంటే పవన్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వగా.. చెర్రి జంజీర్ మూవీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇవి రెండు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టాయి. చరణ్ మరోసారి బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. మరి మెగా ఫ్యామిలీకి వీరాభిమాని అయిన రవి వారిద్దరిపై కామెంట్ చేసేంత ధైర్యం చేశాడా? లేక మరేవరిపైనైనా కామెంట్ చేశాడా అనేది మాస్ మహారాజ్‌కే తెలియాలి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.