English | Telugu

నేడే చూడండి..!!

ఈరోజు నాలుగు సినిమాలు, తెలుగు తెరపై తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. అన్నీ చిన్న సినిమాలే. కానీ కాన్సెప్ట్ ఉన్న సినిమాలని అందరూ చెప్పుకుంటున్నారు. మరి ఈ రోజు ఏమేం రిలీజవ్వబోతున్నాయో ఓ లుక్కేద్దాం..చలో..

గుంటూర్ టాకీస్

సిద్ధార్ధ్, రష్మి, శ్రద్ధా దాస్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా గుంటూర్ టాకీస్. టైటిల్ నుంచి ట్రైలర్ వరకూ మంచి టాక్ సంపాదించుకున్న ఈ సినిమాకు చందమామ కథలుతో నేషనల్ అవార్డ్ కొట్టిన ప్రవీణ్ సత్తారు దర్శకుడు. దీని డిస్ట్రిబ్యూషన్ ను ఇండస్ట్రీలో గోల్డెన్ హ్యాండ్ గా భావించే సాయి కొర్రపాటి తీసుకోవటం సినిమాకు మేజర్ ప్లస్. రష్మీ అందాలతో హీటెక్కించే ట్రైలర్ ను రిలీజ్ చేసి, జనాన్ని రప్పించే ఎత్తుగడ వేశాడు దర్శకుడు. మరి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి..

కళ్యాణ వైభోగమే

అలా మొదలైంది లాంటి మంచి సినిమానే మళ్లీ తెరకెక్కించాను అంటున్నారు దర్శకురాలు నందినీ రెడ్డి. పెళ్లి పట్ల నేటి యువత దృక్పథాన్ని చూపేలా కథ ఉంటుందంటున్నారామె. నాగశౌర్య, మాళవికా నాయర్ జంటగా నటించిన ఈ సినిమాలో, మాజీ హీరోయిన్ రాశి ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఇప్పటికే మూవీ ఆడియో మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడం సినిమాకు ప్లస్.

శౌర్య

ఎప్పుడూ యాక్షన్ మసాలా సినిమాలు తీసే మంచు మనోజ్ కుటుంబ కథా సినిమాల దర్శకుడు దశరథ్ తో జతకట్టి తీసిన సినిమా శౌర్య. తాను ఇంతకు ముందు ఎప్పుడూ చేయనంత కొత్త సినిమా అని మనోజ్ చెబుతున్నాడు. థ్రిల్లర్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా పై కూడా మంచి అంచనాలే ఉన్నాయి.

శివగంగ

హర్రర్ సినిమాలకు డిమాండ్ బాగుండటంతో, తమిళం నుంచి మరో హర్రర్ సినిమా శివగంగ పేరుతో తెలుగులోకి వస్తోంది. శ్రీరామ్, రాయ్ లక్ష్మి ముఖ్యపాత్రలుగా, జంట దెయ్యాలుగా ఈ సినిమాలో కనిపించబోతున్నారు. సినిమా టీం ఎవరూ పెద్దగా ప్రమోషన్ల బరువు పెట్టుకోకపోవడం విచిత్రం. హార్రర్ ను ఆదరిస్తున్న మన ప్రేక్షకులు, శివగంగను ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.