English | Telugu

రాజా సాబ్ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ప్రభాస్ ఫ్యాన్స్ కి షాక్!

పాన్ ఇండియా స్టార్ 'ప్రభాస్'(Prabhas)అప్ కమింగ్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)పై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలతో వింటేజ్ ప్రభాస్ కనిపిస్తున్నాడు. పైగా ప్రభాస్ ఫస్ట్ టైం హర్రర్ కామెడీ జోనర్ చేస్తుండటంతో అంచనాలు రెట్టింపు అయ్యాయని కూడా చెప్పవచ్చు. 'మారుతీ'(Maruthi)దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై 'టిజి విశ్వప్రసాద్'(Tg Vishwa Prasad)ప్రభాస్ కెరీర్లోనే అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నాడు.

రాజాసాబ్ డిసెంబర్ 5 న రిలీజ్ కాబోతుందని అధికార ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. దీంతో డిసెంబర్ 5 కోసం అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. కానీ రీసెంట్ గా తేజ సజ్జ, మంచు మనోజ్ ల 'మిరాయ్'(Mirai)మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమాక్స్ లో జరిగింది. మిరాయ్ కి విశ్వప్రసాద్ నే నిర్మాత. రాజా సాబ్ గురించి మాట్లాడుతు ఇటీవల సినీ కార్మికులు సమ్మె చెయ్యడం వలన, కొంత భాగం షూటింగ్ పెండింగ్ లో ఉంది. త్వరలోనే బ్యాలన్స్ షూటింగ్ ని పూర్తి చేసుకొని 'రాజాసాబ్' ని సంక్రాంతి కానుకగా జనవరి 9 న విడుదల చేస్తున్నామని ప్రకటించాడు. దీంతో పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ప్రభాస్ సంక్రాంతి బరిలో దిగుతున్నట్టయ్యింది. 2004 జనవరి 14 న వర్షం , 2007 జనవరి 10 న యోగి, సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

గత కొన్ని రోజులుగా రాజా సాబ్ డిసెంబర్ 5 నుంచి సంక్రాంతికి వాయిదా పడుతుందనే మాటలు సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. దీంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు 'రాజాసాబ్ ని డిసెంబర్ 5 నుంచి సంక్రాంతి సీజన్ కి మార్చవద్దు. నార్త్ లో సంక్రాంతి ప్రభావం తక్కువ. కాబట్టి డిసెంబర్ 5 నే వస్తే నార్త్ లో కలిసొచ్చి, పుష్ప 2 లాగా పాన్ ఇండియా లెవల్లో సరికొత్త రికార్డులు సృషించవచ్చని సోషల్ మీడియా వేదికగా కోరుతు వస్తున్నారు. ఇక రాజా సాబ్ కి మారుతీ దర్శకుడు కాగా, నిధి అగర్వాల్(Nidhhi Agerwal),మాళవిక మోహనన్(Malavika Mohanan),రిద్ది కుమార్(Riddhi kumar)హీరోయిన్లు. సంజయ్ దత్, సునీల్ శెట్టి, బొమన్ ఇరానీ ,వెన్నెల కిషోర్, విటివి గణేష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్(Thaman)మ్యూజిక్ ని అందిస్తున్నాడు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.