English | Telugu

అల్లరి నరేష్ న్యూ మూవీ సీమటపాకాయ్

అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న న్యూ మూవీకి "సీమటపాకాయ్" అన్న పేరుని నిర్ణయించారు. వివరాల్లోకి వెళితే అల్లరి నరేష్ హీరోగా, పూర్ణ అనే కొత్తమ్మాయిని హీరోయిన్ గా పరిచయం చేస్తూ, జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో విశాఖపట్టణం యమ్.యల్.ఎ. డాక్టర్ మళ్ళ విజయప్రసాద్ తన వెల్ ఫేర్ క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్న మూడవ చిత్రానికి "సీమటపాకాయ్" అన్న పేరుని నిర్ణయించారు.


ఈ చిత్రం టైటిల్ లోగోని, ఏప్రెల్ రెండవ తేదీన, హైదరాబాద్ ఫిలిం నగర్ లోని ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ (ఎఫ్.యన్.సి.సి.)లో ఈ "సీమటపాకాయ్" చిత్రం హీరో అల్లరి నరేష్, నిర్మాత డాక్టర్ మళ్ళ విజయప్రసాద్ ఇద్దరూ సంయుక్తంగా ఆవిష్కరించారు. అనంతరం ఈ చిత్రంలో నటించిన జయప్రకాష్ రెడ్డి, యల్.బి.శ్రీరామ్, జీవా తదితరులు ఈ చిత్రం షూటింగ్ లో తమ అనుభవాలను, ఈ చిత్రం యూనిట్ తో తమకున్న అనుబంధాన్ని సవివరంగా మీడియాకు తెలియజేశారు. ఈ చిత్రానికి సంగీతాన్ని వందేమాతరం శ్రీనివాస్ అందిస్తూండగా, కృష్ణారెడ్డి కొరియోగ్రఫీని నిర్వహిస్తున్నారు.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.