English | Telugu

రచ్చలో ముఠా మేస్త్రిగా రామ్ చరణ్...?

"రచ్చ" లో ముఠామేస్త్రిగా రామ్ చరణ్...నటించనున్నాడని ఫిలిం నగర్ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే మెగాసూపర్ గుడ్ ఫిలింస్ పతాకంపై, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, మిల్కీవైట్ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్ గా, "ఏమైందీ ఈ వేళ" ఫేం సంపత్ నంది దర్శకత్వంలో, యన్.వి.ప్రసాద్, పరాస్ జైన్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా "రచ్చ".ఈ "రచ్చ" సినిమాలో హీరో రామ్ చరణ్ గతంలో తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన "ముఠామేస్త్రి" సినిమాలోని దేశభక్తి పరుడైన ముఠామేస్త్రి వంటి పాత్రలో నటించనున్నాడని తెలిసింది. అది అవుట్ అండ్ అవుట్‍ పక్కా మాస్ పాత్ర.

తన కెరీర్ గ్రాఫ్ మళ్ళీ పైకి లేవాలంటే పూర్తిస్థాయి మాస్ పాత్రలోనే నటించాలని రామ్ చరణ్ భావిస్తున్నాడు. అదే విషయాన్ని దర్శకుడు సంపత్ నందితో కూడా చెప్పాడట. "రచ్చ" సినిమాలో "ముఠామేస్త్రి" సినిమాలోని చిరంజీవి టైపు పాత్రతో పాటు,"గ్యాంగ్ లీడర్" సినిమాలోని "వానవాన వెల్లూవాయే" అనే పాటను కూడా రామ్ చరణ్ ఈ "రచ్చ" సినిమాసినిమా కోసం వాడుకోవటం విశేషం. రచ్చ" సినిమాలో కలర్స్ స్వాతి కూడా ఒక ముఖ్య పాత్రలో నటించనుంది. ఈ "రచ్చ" సినిమా ఈ వారంలోనే ప్రారంభం కానుంది.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.