English | Telugu

సినీ భేతాళ ప్ర‌శ్న‌లు @ 2015

ఓ సినిమా చూసొచ్చామంటే స‌వాల‌క్ష డౌట్లు. అరె.. అదెలా ఎందుకు జ‌రిగింది? అని మ‌న‌లో మ‌న‌మే మ‌ధ‌న‌ప‌డిపోతుంటాం. రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాల్లో లాజిక్‌కి అంద‌ని విష‌యాల్లో బోలెడుంటాయి. వాటికి క‌నీసం స‌ద‌రు ద‌ర్శ‌కుడు కూడా స‌మాధానం చెప్ప‌లేడు. సినిమా వ‌స్తుంది.. వెళ్లిపోతుంది.. ఆ ప్ర‌శ్న కూడా మ‌రుగున ప‌డిపోతుంది. 2015లో అలాంటి డౌట్లు ప్రేక్ష‌కుల‌కు చాలా వ‌చ్చాయి. వాటికి ఇప్పుడైనా స‌మాధానం దొరుకుతుందేమో చూద్దాం. మ‌రింత‌కీ ఈ యేడాది భేతాళ ప్ర‌శ్న‌లుగా మిగిలిపోయిన‌వేంటి? చూద్దాం.. రండి

1. క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడు..?

2. శ్రీ‌మంతుడులో సైకిల్ పాట‌కి కూడా సీజీ వ‌ర్క్ అవ‌స‌ర‌మా?

3. రేయ్ సినిమాకి వైవిఎస్ చౌద‌రి 30 కోట్లు ఎలా పెట్టాడు?

4. సౌఖ్యం సినిమా టైటిల్‌కీ ఆ సినిమా క‌థ‌కీ, సినిమా చూసొచ్చిన ప్రేక్ష‌కుడి ఫీలింగ్స్‌కీ మ్యాచింగ్ ఉందా?

5. టెంప‌ర్‌లో ఒక్క‌రోజులో ఊరిశిక్ష ఎలా అమ‌లు చేశాడు? ఇదెక్క‌డైనా ఉందా?

6. గోన‌గ‌న్నారెడ్డి క‌థ తీసి.. రుద్ర‌మ‌దేవి అని టైటిల్ ఎందుకు పెట్టారు?

7. అఖిల్ సినిమా సూర్య క‌వ‌చం చుట్టూ తిరుగుతుంది. సినిమాలో సన్నివేశాలు మాత్రం లాజిక్‌ లేకుండా ఎటుఎటో తిరుగుతుంటాయి.

8. గోపాల గోపాల‌లో భారీ భూకంపం వ‌చ్చి.. వెంక‌టేష్ షాపు ఒక్క‌టే కుప్ప‌కూలిపోతుంది. దేవుడేదో ప‌గ‌బ‌ట్టిన‌ట్టు.

9. బెంగాల్ టైగర్‌లో రాశీఖ‌న్నా బికినీ ఎందుకు వేసింది? త‌మ‌న్నాకు త‌న అందాల్ని చూపించ‌డానికా?

10. ల‌య‌న్‌లో బాల‌య్య గ‌తం మ‌ర్చిపోతాడు.. త‌న‌కి ద్రోహం చేసిన విల‌న్లు గుర్తుండ‌రు. కానీ...హీరోయిన్‌ని మాత్రం ఫ‌స్ట్ లుక్‌లోనే గుర్తుప‌ట్టేస్తాడు. అదెలా సాధ్య‌మో?


జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.