English | Telugu

తేజా.. ఇప్పుడేమంటావ్?

తేజ‌ది ఓవ‌ర్ కాన్ఫిడెన్స్‌తోనో, త‌న సినిమాపై అస‌లే మాత్రం కాన్ఫిడెన్స్ లేకో.. ఓ మాట అనేశాడు. ''నా సినిమా చూసేముందు టాక్ తెలుసుకోండి. న‌చ్చితే చూడండి. లేదంటే పైర‌సీ చూసేయండి. ఏం ఫ‌ర్వాలేదు..'' అంటూ ఓ బోల్డ్ స్టేట్ మెంట్ ఇచ్చాడు. తేజ ఇలా మాట్లాడాడంటే నిజంగానే సినిమాలో ఏదో మేట‌ర్ ఉండే ఉంటుంద‌ని అనుకొన్నారంతా. అయితే హోరా హోరీ మాత్రం దారుణంగా నిరాశ ప‌రిచింది. జ‌యం సినిమానే ఇంకో యాంగిల్‌లో తీసి... బోర్ కొట్టించాడు తేజ‌.

తొలిసారి త‌న సినిమాకి `కామెడీ` కోటింగ్ ఇద్దామ‌ని ప్ర‌య‌త్నించి భంగ‌ప‌డ్డాడు. త‌లాతోకా లేని టేకింగ్‌తో, లాజిక్ లేని స‌న్నివేశాల‌తో విసిగించేశాడు. తేజ మార‌లేదు... అత‌ని క‌థా మార‌లేదు అంటూ.. ఈ సినిమా చూసిన‌వాళ్లంతా నొస‌లు చిట్లించుకొంటున్నారు. తానేదో గొప్ప క‌ళాఖండం తీసిన‌ట్టు, మిగిలిన వాళ్లంతా రొటీన్ సినిమాలు తీస్తూ బోర్ కొట్టిస్తున్నార‌ని, ఇండ్ర‌స్ట్రీలో ఉన్న‌వి రెండే రెండు క‌థ‌ల‌ని సెటైర్లు వేసిన తేజ‌... తాన ద‌గ్గ‌ర కూడా రెండే క‌థ‌లున్నాయిని, వాటినే తిప్పి తిప్పి తీస్తున్నాన‌ని హోరా హోరీతో మ‌రోసారి నిరూపించుకొన్నాడు తేజ‌.

ఈ సినిమా తొలి షోకే ఫ్లాప్ టాక్ మూట‌గ‌ట్టుకొంది. న‌చ్చ‌క‌పోతే.. పైర‌సీ చూడండి అన్న తేజ‌... ఇప్పుడేమంటాడు. రేప‌టి నుంచి 'నా సినిమా చూడండి' అంటూ ప్ర‌మోష‌న్లు ఎలా చేసుకొంటాడు..?! ఇప్పుడు తేజ ఎలా స్పందిస్తాడో చూడాలి మ‌రి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.