English | Telugu

ఒక్క చెన్నైలోనే సూర్య 'అంజాన్' కి అన్ని థియేటర్లా..!

ఇటీవల కాలంలో స్టార్ హీరోల సినిమాలు సాధ్యమైనంత వరకూ ఎక్కువ థియేటర్లలో విడుదల చేసి మొదటి వారంలో కలెక్షన్స్ రాబట్టుకోవడానికి దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. మన తెలుగు నిర్మాతలు ఈ స్ట్రాటజీని పాటిస్తున్నారు. ఇప్పుడు ఈ అలవాటు మెల్లగా తమిళ సినిమాలో వచ్చేసింది. సూర్య నటించిన సికిందర్ చిత్రం ఆగస్టు 15న భారీగా విడుదలవుతుంది. లింగుస్వామి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సూర్య, సమంత నటించారు. తమిళంలో 'అంజాన్' అనే పేరుతో విడుదలవుతుండగా... తెలుగులో 'సికిందర్' అనే పేరుతో విడుదలవుతుంది.

తెలుగు, తమిళం రెండు భాషల్లో కలిపి సుమారుగా 1500 ధియేటర్లలో ఈ సినిమా విడుదవుతుంది. చెన్నైలో ఏకంగా ఈ సినిమాని 37 ధియేటర్లలో ప్రదర్శించనున్నారు. చెన్నై నగరానికి చెందిన ఈ సినిమా హక్కులను అభిరామి రామనాథన్ కొనుగోలు చేశారు. రామ్ నాధన్ మాట్లాడుతూ.. ''గతంలో చెన్నైలో ఐదు థియేటర్లలోనే సినిమా విడుదలయ్యేది. రజనీకాంత్‌ నటించిన 'శివాజి' గరిష్ఠంగా 18 థియేటర్లలో విడుదల చేశాం. ఇప్పుడు 'అంజాన్‌'ను 37 ధియేటర్లలో విడుదల చేస్తున్నారు.

సూర్య అభిమానులకు టిక్కెట్లు లభించడం లేదని తెలయడంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. పైరసీ సీడీలను అడ్డుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. చెన్నైలోని అభిరామి థియేటర్‌‌లో రిజర్వేషన్ ప్రారంభించిన రెండు గంటలకే 5,000 టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ఈ సినిమా సూర్య కెరియర్‌లోనే ఓ మైలు రాయిగా నిలవడంతో పాటు బాక్సాఫీసు రికార్డుల్ని తిరగరాస్తుందన్నారు. సూర్య సరసన తొలిసారిగా సమంత నటిస్తుంది. ఈ చిత్రానికి సంగీతం యువన్ శంకర్ రాజా అందించగా.. సంతోష్ శివన్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.