English | Telugu

ఫిలింనగర్‌లో శ్రీమంతుడి దోసె..ధర రూ.670

గ్రామాల దత్తత కాన్సెప్ట్‌తో వచ్చి అందరికి ఇన్స్‌పిరేషన్‌గా నిలిచిన మూవీ శ్రీమంతుడు. మహేశ్ బాబు కెరిర్‌లోనే గాక తెలుగు సినిమా చరిత్రలోనూ మైల్‌స్టోన్‌గా నిలిచిన మూవీ. ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. శ్రీమంతుడులో వాడిన కాస్ట్యూమ్స్, సైకిల్ వేటికవే ప్రత్యేకమైనవి. వీటి కోసం అభిమానులు ఎగబడ్డారు. ఇప్పుడు ఆ క్రేజ్‌ని క్యాష్ చేసుకోవడానికి మరో సంస్థ సిద్థమైంది.

హైదరాబాద్ ఫిలింనగర్ రోడ్ నెం.1లో నూతనంగా ఏర్పాటైన కారంపొడి రెస్టారెంట్ కస్టమర్లను ఆకట్టుకోవడానికి శ్రీమంతుడు దోసెని ఇంట్రడ్యూస్ చేసింది. దీని ధర 670 రూపాయలుగా నిర్ణయించారు నిర్వహకులు శ్యామ్ జంపాల. శ్రీమంతుడు దోసెతో పాటు బొమ్మిడాల పులుసు, రాగి సంగటి, నాటు కోడి పులుసు, భాగమతి మసాలా పప్పు, జొన్నరొట్టె, నెయ్యి అన్నం మెనులో స్పెషల్ ఎట్రాక్షన్. సో వీలు కుదిరినప్పుడు మీరు కూడా వెళ్లి లాగించండి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.