English | Telugu

శ్రీజ కేసు ఏప్రిల్ 16కు వాయిదా

ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి కుమార్తె శ్రీజ, శిరీష్ భరద్వాజ్ ల కేసు విచారణ ఏప్రిల్ 16కు వాయిదా పడింది. శ్రీజ ఈనెల 15న భర్త శిరీష్, భరద్వాజ్, అత్తపై సీసీఎస్ పోలిస్ స్టేషన్ లో కేసు పెట్టింది. శిరీష్, అతని తల్లి ముందస్తు బెయిలుకోసం దరఖాస్తు చేయగా కోర్టు తల్లికి మాత్రమే బెయిలు మంజూరు చేసి భరద్వాజ్ పెటిషన్ ను కొట్టివేసింది.

తన భార్యతో మాట్లాడడానికి ఒకసారి అవకాశం కల్పించాలని అతను కోర్టును కోరాడు. దీనిపై స్పందించిన కోర్టు ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇవ్వాలని సూచనలు చేసింది. శ్రీజ తరపు న్యాయవాది వాయిదా కోరారు. దీంతో వచ్చే నెల 16కు కేసును వాయిదా వేశారు.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.