English | Telugu

సంక్రాంతికి వ‌స్తున్నాం…కొడుతున్నాం: నాగార్జున

కింగ్ నాగార్జున ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం ‘సోగ్గాడే చిన్ని నాయనా.రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి నాయికలు. కల్యాణ్‌ కృష్ణ దర్శకుడు. నాగార్జున, పి.రామ్మోహన్‌ నిర్మాతలు. అనూప్‌ రూబెన్స్‌ స్వరాలందించారు శుక్రవారం శిల్పకళావేదికలో పాటల్ని విడుదల చేశారు. తొలి సీడీని దర్శకుడు కె.రాఘవేంద్రరావు ఆవిష్కరించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘ఇందులో నాగార్జున పంచెకట్టు చూస్తే ‘దసరాబుల్లోడు’ చిత్రంలో ఏఎన్నార్‌ గుర్తొచ్చారు. ట్రైలర్‌ చాలా బావుంది. కచ్చితంగా ‘దసరాబుల్లోడు’ తరహాలో సక్సెస్‌ అవుతుంది’’ అని అన్నారు.

నాగార్జున మాట్లాడుతూ ‘‘అభిమానుల్ని కలిసి రెండేళ్లయింది. ‘మనం’తో పెద్ద హిట్‌ ఇచ్చారు. ఆ సినిమా తర్వాత దానిని మించిన సినిమా చెయ్యాలని ఆలోచిస్తున్న సమయంలో రామ్మోహన్‌ ఈ కథ చెప్పాడు. కల్యాణ్‌ కృష్ణ చక్కగా తీర్చిదిద్డాడు. నాన్న‌గారు అనురాగం, అత్మీయ‌త‌, అనుబంధాలు, ప‌ల్లెటూరి వాతావ‌ర‌ణం ఇలాంటి సినిమాల‌నే చేసి ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యారు. అలాంటి సినిమాకు హ‌లోబ్ర‌ద‌ర్ లాంటి ఎంట‌ర్‌ట్‌న్‌మెంట్‌ను యాడ్ చేస్తే ఎలా ఉంటుందోన‌ని ఆలోచ‌న‌తో ఈ సినిమా చేశాం. తెలుగువారికి ఇష్ట‌మైన పండుగ సంక్రాంతి. ప‌చ్చ‌ద‌నం, తియ్య‌ద‌నం అన్నీ క‌లిసి ఉంటాయి. అలాగే ఈ చిత్రంలో కూడా అన్నీ ఎలిమెంట్స్ ఉంటాయి. అనూప్‌ ఎప్పటిలానే వినసొంపైన పాటలు సమకూర్చారు. సంక్రాంతికి వ‌స్తున్నాం…కొడుతున్నాం’’ అని అన్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.