English | Telugu

మెగా హీరోల ప‌రువు తీసిన‌... సైమా

సంపూతో మెగా హీరోలు పోటీ ప‌డితే ఎలా ఉంటుంది?? అందులోనూ ఓ అవార్డు కోసం..?? సంపూ రేంజు పెరిగిందనుకోవాలా, లేదంటే మెగా హీరోల స్థాయి దిగ‌జారింద‌నుకోవాలా?? అనే ప్ర‌శ్న త‌ప్ప‌కుండా ఉద‌యిస్తుంది. అలా మెగా హీరోల‌తో `సైమా` ఆటాడేసుకొంది. టోట‌ల్‌గా మెగా ఫ్యామిలీ ప‌రువు తీసింది. దక్షిణాదిన‌ సినిమా రంగానికి సంబంధించి ప్ర‌తి ఏడాదీ ‘సైమా’ అవార్డ్స్ ని ఇస్తోంది.

2014 సంవ‌త్స‌రానికి గానూ సైమా త‌న నామినీ లిస్ట్ విడుద‌ల చేసింది. ఈ లిస్టు చూసి మెగా ఫ్యాన్స్ షాక్ తిన్నారు. ఎందుకంటే బెస్ట్ డెబ్యూ హీరోల లిస్టులో సాయి ధరమ్ తేజ్ (పిల్లా నువ్వు లేని జీవితం), వరుణ్ తేజ్ (ముకుంద‌) పేర్లు క‌నిపించాయి. ఆ ప‌క్క‌నే సంపూర్ణేష్ బాబు (హృద‌య‌కాలేయం) పేరు ఉండ‌డం...మెగా ఫ్యాన్స్‌ని విస్మ‌య‌ప‌రిచింది. ఈ అవార్డు కోసం సంపూతో వీళ్లు పోటీ ప‌డాలా?? అంటూ ముక్కున వేలేసుకొంది.

ఒక వేళ సంపూకే ఈ అవార్డు ద‌క్కితే తమ హీరోల ప‌రువేంగానూ.. అంటూ మెగా ఫ్యాన్స్ త‌ల్ల‌డిల్లిపోతున్నారు. ఈ వేడుక‌కు మెగా హీరోలు హాజ‌ర‌వుతారా? అనే ప్ర‌శ్న కూడా త‌లెత్తుతోంది. మ‌రి మెగా హీరోలు దీన్ని త‌మ ప్రెస్టేజియ‌స్ ఇష్యూగా తీసుకొంటారో, లేదంటే స్పోర్టీవ్‌గా వ్య‌వ‌హ‌రిస్తారో చూడాలి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.