English | Telugu

సంగీత దర్శకుడి కూతురు అనుమానాస్పద మృతి

ఒక సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చి, హోటల్లో మృతి చెందిన మళయాళ నటి కల్పన ఘటన మరువక ముందే, మరో మళయాళీ హోటల్ లో మరణించారు. ప్రముఖ మళయాళీ సింగర్ షాన్ జాన్సన్ (29) చెన్నైలోని ఒక హోటల్ లో అనుమానాస్పదంగా మృతి చెందారు. సాధారణంగా, తమ సాంగ్స్ రికార్డింగ్ కు సౌత్ ఇండియన్స్ అందరూ చెన్నై వస్తుంటారు. అలాగే తన పాట రికార్డింగ్ కోసం చెన్నై చేరుకున్న షాన్, ఒక ప్రైవేట్ హోటల్ లో బస చేశారు.

గురువారం తన సాంగ్ రికార్డింగ్ పూర్తయిన తర్వాత హోటల్ కు చేరుకున్న ఆమె, శుక్రవారం మరో రికార్డింగ్ ను కూడా పూర్తి చేసి, కేరళ బయలుదేరాల్సి ఉంది. ఇంతలోనే ఆమె హఠాన్మరణం చెందడం, తమిళ మళయాళ చిత్రసీమల్ని షాక్ కు గురి చేసింది. ఆమె మరణానికి గల కారణాలు ఇంకా తెలియనప్పటికీ, గుండెపోటు కారణంగానే ఆవిడ మరణించి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. షాన్ తండ్రి జాన్సన్ ప్రముఖ మళయాళ సంగీత దర్శకుడు. తన సంగీతానికి జాతీయ అవార్డును కూడా అందుకున్నారు. 2011లో తండ్రిని, 2012లో సోదరుడ్ని పోగొట్టుకున్నారు షాన్. ఇప్పుడు ఆవిడ కూడా మరణించడంతో ఆమె తల్లి రాణి జాన్సన్ శోకసంద్రంలో మునిగిపోయారు. ఆమె మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.