English | Telugu

పడిపోతున్న షారుఖ్ ఫ్యాన్ కలెక్షన్స్..!

పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్, ఓపెనింగ్ రోజున కలెక్షన్లు కుమ్మేసింది. కానీ ఫస్ట్ డే టాక్ బయటికొచ్చిన తర్వాత పూర్తి విరుద్ధంగా కలెక్షన్లు మారిపోయాయి. ప్రస్తుతం షారుఖ్ నటించిన ఫ్యాన్ సినిమా కూడా ఇదే దారిని ఫాలో అవుతోంది. షారుఖ్ సినిమాల్ని చూడటానికి వచ్చేవాళ్లు ఎక్కువగా కామెడీనే ఎక్సెపెక్ట్ చేస్తారు. కానీ ఫ్యాన్ మాత్రం రొటీన్ మాస్ మాసాలాకు భిన్నంగా, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కింది. ఖాన్ ఫ్యాన్స్ కు సినిమా పిచ్చిపిచ్చిగా నచ్చేసినా, మామూలు ఆడియన్స్ కు మాత్రం పెద్దగా నచ్చట్లేదు. సోమవారానికి, ఫ్యాన్ సినిమా కేవలం 58.40 కోట్ల బిజినెస్ మాత్రమే చేయగలిగింది. కలెక్షన్లలో దాదాపు 70 శాతం పడిపోయింది. బాలీవుడ్ మార్కెట్ ప్రకారం, షారుఖ్ లాంటి స్టార్ సినిమాకు ఇవి చాలా ఘోరమైన లెక్కలే మరి. సినిమా కనీసం వందకోట్లు టచ్ చేస్తుందా అనేది అనుమానంగా మారింది. సోమవారం వరకూ ఇండియాలో షారుఖ్ ఫ్యాన్ కలెక్షన్ల అంచనా..


శుక్రవారం 19.20 కోట్లు
శనివారం 15.40 కోట్లు
ఆదివారం 17.75 కోట్లు
సోమవారం 6.05 కోట్లు

మొత్తం 58.40 కోట్లు (ఇండియా కలెక్షన్లు మాత్రమే)

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.